blame

అగ్నిపథ్ పథకం పేరుతో సైన్యం నియామకాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు.. దేశవ్యాప్తంగా చిచ్చు పెట్టాయి. అటు బీహార్ సహా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు మిన్నంటాయి. ఇటు తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రణరంగంగా మారింది. ఆందోళనకారులు రైళ్లను తగలబెట్టారు, పోలీస్ కాల్పుల్లో ఒకరు మృతిచెందారు. అయితే ఈ పాపమంతా ప్రధాని నరేంద్రమోదీదేనంటూ ట్విట్టర్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్. సైనిక ఉద్యోగాలకోసం సిద్ధమవుతున్న నిరుద్యోగుల జీవితాలతో మోదీ ఆటలు ఆడుకుంటున్నారని మండిపడ్డారు. […]