BJP

పవన్‌ కల్యాణ్ తొలి నుంచి జగన్‌పై ఏదో వ్యక్తిగత ద్వేషం ఉన్నట్టుగా మాట్లాడుతూ వస్తున్నారు. ఇది చూసిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో పవన్‌ తిరిగి తప్పనిసరిగా తనకే మద్దతు ఇస్తారన్న ధీమాతో ఉంటూ వచ్చారు. బీజేపీ కూడా తనవైపు వస్తుందని ఆయన ఆశించారు. రెండు పార్టీలకు కలిపి పాతిక, ముప్పై సీట్లు ఇచ్చి పండుగ చేసుకోండి అని అందామనుకున్నారు. కానీ అలా లేదు పరిస్థితి. జగన్‌ అంటే పడని పవన్‌ వీక్‌నెస్‌తో ఆడుకుందామని చంద్రబాబు అనుకుంటే.. ఇప్పుడు […]

తెలంగాణలో బీజేపీ ‘త్రిపుర వ్యూహం’ అనుసరించనున్నట్టు తెలుస్తోంది.విజయమే లక్ష్యంగా ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటరునూ కలిసేలా సంఘ్ పరివార్ నాయకులు ఆ రాష్ట్రంలో విస్తృతంగా జరిపిన ప్రచారం ఫలితాన్ని ఇచ్చినట్టు విశ్లేషణలున్నవి.బీజేపీకి రెండు శాతం ఓట్లు కూడా లేని త్రిపురలో ఆ పార్టీతోపాటు సంఘ్‌పరివార్‌ సంస్థల నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటరును కలిసి అభివృద్ధి అజెండాను వివరించారు.దాంతో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న వామపక్షాల్ని ఓడించి భాజపా అధికారంలోకి వచ్చిందని సంఘ్‌ పరివారం చెబుతోంది.త్రిపురలో 25 […]

పొత్తులపై పవన్‌ కల్యాణ్ మరింత స్పష్టత ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన సూచనలు చేశారు. ప్రస్తుతం జనసేన ముందు మూడు మార్గాలున్నాయని.. 1- బీజేపీ- జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, 2- జనసేన-బీజేపీ- టీడీపీ కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం, 3- జనసేన ఒక్కటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. ఈ మూడింటిలో దేనికైనా జనసేన సిద్ధంగానే ఉందని.. పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అన్న మాటను తాము నమ్ముతానన్నారు. ఈ సందర్బంగా తాను […]

ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ ఖాయం అని గతంలోనే బీజేపీ చెప్పినా అభ్యర్థి విషయంలో తర్జన భర్జనలు జరిగాయి. చివరకు జిల్లా పార్టీ అధ్యక్షుడు భరత్ కుమార్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, జిల్లా నేతలు హాజరయ్యారు. వైసీపీ స్థాయిలో కాకపోయినా.. బీజేపీ కూడా నామినేషన్ కార్యక్రమానికి మేళ తాళాలతో హంగామా చేసింది. పవన్ ప్రకటన మరుసటి […]

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో తటస్థ వైఖరిని కొనసాగిస్తోంది వైసీపీ. ఎప్పుడూ సూటిగా విమర్శించలేదు, అలాగని కేంద్రం విధానాలను పొగడనూ లేదు. అదే సమయంలో బీజేపీ కూడా ఏపీ ప్రభుత్వంపై ఎప్పుడూ నిందలు వేయలేదు. రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం కేంద్ర నిధులతో పథకాలు అమలు చేస్తున్నారని, కనీసం మోదీ ఫొటో కూడా వేయడంలేదని, ఏపీలో హిందువులకు అన్యాయం జరుగుతోందంటూ.. విమర్శలు చేస్తుంటారు. ఈ దశలో వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ అధినాయకత్వం వైఖరి ఏంటి..? జగన్ పాలనపై […]

ఆత్మకూరు ఉపఎన్నికల్లో టీడీపీ పోటీ చేయట్లేదని ఇదివరకే ప్రకటించారు చంద్రబాబు. బీజేపీ మాత్రం తాను పోటీలో ఉన్నానంటోంది. మిత్రపక్షం జనసేనను కలుపుకొని, వారితో చర్చించి, వారి మద్దతుతో అక్కడ అభ్యర్థిని నిలబెడతానంటోంది. దీనికోసం ఓ కమిటీని కూడా వేసింది. అయితే అభ్యర్థులు పోటీకి వెనకాడుతుండటంతో ఇంకా డైలమాలోనే ఉంది బీజేపీ. నెల్లూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు భరత్ కుమార్ పేరు వినిపించినా, ఆయనా వెనకడుగు వేస్తున్నట్టు సమాచారం. ఈ దశలో పవన్ కల్యాణ్ బీజేపీకి షాకిచ్చారు. ఆత్మకూరు […]

2019 ఎన్నికలకు ముందు వరకు బీజేపీ ఉత్తరాది పార్టీ, పాచిపోయిన లడ్డూలు ఇచ్చింది అంటూ విరుచుకుపడ్డ పవన్ కల్యాణ్.. ఎన్నికలు అయిపోగానే హఠాత్తుగా ఎర్ర తువ్వాలు కిందపడేసి కాషాయం కట్టేశారు. అలా చేయడానికి చాలా కారణాలున్నాయని చెబుతుంటారు. ఇప్పుడు అదే పవన్‌ కల్యాణ్‌ బీజేపీని వదిలించుకోవడం ఎలా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని కూటమి ఉమ్మడి సీఎం అభ్యర్థిగా బీజేపీ ప్రకటిస్తుందట కదా అన్న ప్రశ్నకు..” నేను గాల్లో మేడలు కట్టను. ఇదంతా ప్రచారం మాత్రమే.బీజేపీ అధ్యక్షుడు నడ్డా […]

కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ మరోసారి విరుచుకుపడ్డారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ప్రసంగించిన కేసీఆర్.. కేంద్రం నుంచి తెలంగాణకు నయాపైసా కూడా సాయం అందడం లేదన్నారు. న్యాయంగా రావాల్సిన నిధుల్లోనూ కోత పెడుతున్నారని విమర్శించారు. నిధులు కేటాయించాలని ప్రధానిని కోరినా ఉపయోగం లేకుండా పోయిందన్నారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. కేంద్రంపై పోరాటాలు చేయాల్సి వస్తోందన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు 24వేల కోట్లు ఇవ్వాలన్న నీతిఆయోగ్ సిఫార్సులను కూడా కేంద్రం […]

బీజేపీ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నది. డీమానిటైజేషన్ దగ్గర నుంచి ధరల పెరుగుదల వరకు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఇప్పుడు మరోసారి దేశ ప్రజలకు షాకిచ్చే నిర్ణయం మోడీ ప్రభుత్వం తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. త్వరలో జనాభా నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ హింట్ ఇచ్చారు. చత్తీస్‌గడ్ రాజధాని రాయ్‌పూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోటిక్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్‌‌లో జరిగిన ‘గరీబ్ కల్యాణ్ […]

ఇటీవల కొంతకాలంగా తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెంచింది. తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలనే వ్యూహంతో పావులు కదుపుతున్నారు నేతలు. వరుస ఉప ఎన్నికల్లో సత్తా చూపడం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ని ముప్పతిప్పలు పెట్టడంతో బీజేపీ కాస్త ఎక్కువగానే ఊహల్లో మునిగితేలుతోంది. అదే సమయంలో అధినాయకత్వం కూడా తెలంగాణపై మనసుపారేసుకుంది. కేంద్ర రాజకీయాల్లోకి రావాలనుకుంటూ కూటములకు జవసత్వాలు సమకూరుస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కి చెక్ పెట్టడంతోపాటు, తెలంగాణలో అధికారం జేచిక్కించుకోవడమే పరమావధిగా బీజేపీ అగ్రనాయకత్వం […]