Bandi Sanjay

తిరుమల కొండ పవిత్రతపై, లడ్డూ ప్రసాదాలపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివ్రత్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేసిన సంజయ్‌

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలగా ఉన్న భారతీయ జనతా పార్టీ రోజుకో ఎత్తుగడ వేస్తోంది. ఆ పార్టీకి బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడయ్యాక మతపరమైన విషయాలపైనే కేంద్రీకరిస్తూ రాష్ట్రంలో మతపరమైన చీలికను తీసుకొచ్చి ఎన్నికల్లో లాభపడాలని సీరియస్ గానే ప్రయత్నిస్తోంది. నిన్న గాక మొన్న ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను ఏర్పాటు చేసి అగ్రనేతలంతా హైదరాబాద్ లో వాలిపోయారు. కొందరు నాయకులు జిల్లాలు కూడా పర్యటించారు. వాళ్ళు ఊహించినంత జనసమీకరణ […]

తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న భారతీయ జనతా పార్టీ దాని కోసం అనేక ఎత్తుగడ‌లు వేస్తోంది. ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్ లో జరిపించడం ద్వారా పార్టీ బలపడొచ్చని ఆ పార్టీ ఎత్తు వేసింది. పైగా ఆ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా సహా ఆ పార్టీ అగ్రనేతలంతా హైదరాబాద్ వచ్చారు. ఆ సందర్భంగా ఇతర పార్టీల నుంచి నాయకులను పెద్ద ఎత్తున బీజేపీ లో […]

తెలంగాణ బీజేపీలో వర్గ పోరు తీవ్ర స్థాయికి చేరిందని కొంత కాలంగా వినిపిస్తున్న వార్తలు. ఆ పార్టీ జాతీయ కార్యవర్గం సమావేశం సందర్భంగా ఆ పోరు పీక్ కు చేరిందని కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మధ్య కొద్ది రోజులుగా పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. రాబోయే ఎన్నికల్లో తామే గెలుస్తామని అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు కావాలన్న అంశంపై ఒకరిపై ఒకరు ఎత్తులు పై […]

ప్రధాని మోదీ కరీంనగర్ యాదమ్మ చేతి వంట తినబోతున్నారు. జూలై 2 నుంచి హైదరాబాద్ లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గసమావేశాల్లో పాల్గొనే అతిథులకు తెలంగాణ వంటలను రుచి చూపించాలని బండి సంజయ్ నిర్ణయించారు. అందుకోసం యాదమ్మను కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు రప్పించారు. తెలంగాణ వంటలు వండాలంటే అందరికీ యాదమ్మనే గుర్తొస్తుందని ప్రతీతి. ఎక్కడ పెద్ద పెద్ద సభలు, సమావేశాలు జరిగినా వంటల కోసం యాదమ్మనే పిలుస్తారు. మం త్రులు కేటీఆర్ తో సహా అనేక […]

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమైనట్టు సమాచారం. ఈ రోజు ఆయనతో బీజేపీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జీ త‌రుణ్ చుగ్‌, పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌లు భేటీ అయ్యారు. విశ్వేశ్వర రెడ్డి ఇంట్లోనే జరిగిన ఈ భేటీ దాదాపు గంటకు పైగా జరిగింది. విశ్వేశ్వర రెడ్డిని బీజేపీలో చేరవలసిందిగా త‌రుణ్ చుగ్ ఆహ్వానించగా ఆయన సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు జూలై […]

మరో 6 రోజుల్లో హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాలకు ఆ పార్టీ అగ్ర నాయకులు ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డాతో సహా అతిరథ మహారథులంతా హాజరవుతున్నారు. దాంతో ఈ సమావేశాల ఏర్పాట్లను ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండిసంజయ్ ప్రతిష్ఠ‌గా తీసుకున్నారు. తన అతిథి మర్యాదలు, ప్రచారం చూసి అగ్రనాయకత్వం డంగై పోవాలని సంజయ్ భావిస్తున్నారు. అందుకోసం నగరం […]

తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని సర్వేలు ఘోషిస్తున్నాయి. మెజార్టీ స్థానాల్లో ఆ పార్టీకి డిపాజిట్ దక్కించుకోగల‌ అభ్యర్థులు కూడా లేరు. చాలా గ్రామాల్లో బీజేపీకి కార్యకర్తలు కూడా లేరు. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి పీఠం కోసం తన్నులాడుకుంటున్నారు. 18 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం సందర్భంగా తెలంగాణ బీజేపీలోని గ్రూపిజం మరో సారి తెరపైకి వచ్చింది. హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గం, […]