దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో 57 మంది ఎంపీలుగా ఎన్నికయ్యారు. వీరందరిలో ఏపీ, తెలంగాణకు చెందిన ఎంపీలే అత్యంత ఆస్తిపరులు, అప్పులు ఉన్నవారిగా తేలింది. ఈ మేరకు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఒక నివేదిక విడుదల చేసింది. ఎలాంటి పార్టీలతో సంబంధం లేని, పక్షపాతం లేని ఒక సలహా సంస్థనే ఏడీఆర్. కొత్తగా ఎన్నికైన ఎంపీల్లో 40 శాతం మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు […]