హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన మోటర్ వాహనాల చట్టం-2019ని నిరసిస్తూ.. ఆటో, క్యాబ్, లారీ డ్రైవర్స్ యూనియన్ ఒకరోజు బంద్ చేపట్టింది. అర్థరాత్రినుంచి బంద్ మొదలు కాగా.. ఇప్పటికే ప్రయాణికులకు అవస్థలు మొదలయ్యాయి. ప్రైవేటు వాహనాలు లేక ప్రయాణికులు గమ్యస్థానాలు చేరేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నా.. రద్దీ పెరిగిపోవడంతో ప్రజలకు కష్టాలు తప్పడంలేదు. డ్రైవర్స్ జేఏసీ చేపట్టిన బంద్ అర్ధరాత్రి నుంచి మొదలైంది. ఆటోలు, క్యాబ్లు, లారీల సేవలు పూర్తిగా […]