పార్లమెంట్ సహా అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతోందనే ప్రచారం ఇటీవల జోరందుకుంది. కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనంలో లోక్ సభ సీటింగ్ కెపాసిటీ ఎక్కువ అనే వార్తలు రావడంతో ఈ ప్రచారానికి మరింత ప్రాధాన్యత లభించింది. అయితే ఇదివరకే దీనిపై కేంద్రం స్పష్టతనివ్వగా.. తాజాగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మరోసారి సమాధానం రూపంలో నియోజకవర్గాల పునర్విభజనపై క్లారిటీ వచ్చింది. విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని భావించారంతా. […]