ది క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్ (క్వాడ్) సమ్మిట్లో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ వెళ్లారు. టోక్యో వేదికగా జరిగే ఈ శిఖరాగ్ర సమావేశం ఇండియాకు చాలా కీలకంగా మారనున్నది. మన దేశానికి సరిహద్దులుగా ఉన్న పాకిస్తాన్, చైనా నుంచి వస్తున్న ముప్పును ఎదుర్కోవడానికి తగిన సపోర్ట్ కోసం ఈ క్వాడ్ ఉపయోగపడనున్నది. ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలు సభ్యులుగా ఏర్పడిన ఈ క్వాడ్.. భవిష్యత్లో దక్షిణ, తూర్పు ఆసియాలో కీలకంగా మారనున్నది. […]