Army issue

ఆర్మీ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మంత్రి కేటీఆర్‌ మరోసారి విరుచుకుపడ్డారు. అగ్నిపథ్‌ స్కీంకు వ్యతిరేకంగా నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో వేల మంది యువకులు కర్రలు చేతబట్టి ర్యాలీ చేస్తున్న వీడియోను కేటీఆర్ రీట్వీట్ చేశారు. రైతులను సంప్రదించకుండా నల్ల చట్టాలు, వ్యాపారులను సంప్రదించకుండా జీఎస్టీ, దేశపౌరుల బాధలను పరిగణలోకి తీసుకోకుండా డిమానిటైజేషన్, మైనార్టీలతో చర్చించకుండా సిఎఎ వంటి నిర్ణయాలను బీజేపీ నియంతృత్వ ప్రభుత్వం తీసుకుని దేశాన్ని సంక్షోభంలోకి నెట్టేసిందని విమర్శించారు. దేశ వ్యాప్తంగా యువత […]