ఏపీలో టెన్త్ పరీక్షలు ఫెయిలైన విద్యార్థులకోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ విచిత్ర, వినూత్న ప్రదిపాదన చేశారు. ఫెయిలైనవారికి ఆయా సబ్జెక్టుల్లో 10 గ్రేస్ మార్కులు కలిపి పాస్ చేయించాలన్నారు. అంతే కాదు, పదో తరగతి ఫలితాలు సరిగా లేకపోవడానికి కారణం ప్రభుత్వమేనని విరుచుకుపడ్డారు పవన్ కల్యాణ్. ఉపాధ్యాయులకు సంబంధం లేని డ్యూటీలు వేశారని, బోధన కాకుండా ఇతర పనులు వారితో బలవంతంగా చేయించారని, అందుకే పాఠశాలల్లో విద్యా బోధన సరిగా సాగలేదని చెప్పారు పవన్. […]