AP SSC

ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదల తర్వాత అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. గతంలో పరీక్ష ఫలితాల విషయంలో ఎప్పుడూ ఇంత రాద్ధాంతం, ఇంత చర్చ జరిగిన సందర్భాలు లేవు. కానీ ఈసారి మాత్రం ప్రభుత్వ వైఫల్యంతోనే ఫలితాలు తక్కువగా వచ్చాయని ప్రతిపక్షం దుమ్మెత్తి పోస్తోంది. దీనికి విరుగుడుగా.. వైసీపీ నేతలు కౌంటర్లు ఇవ్వడం మొదలు పెట్టారు. పరీక్ష పేపర్లు తయారు చేసింది, కరెక్షన్ చేసింది టీచర్లేనని, పవన్ కల్యాణ్ […]

ఏపీలో టెన్త్ పరీక్షలు ఫెయిలైన విద్యార్థులకోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ విచిత్ర, వినూత్న ప్రదిపాదన చేశారు. ఫెయిలైనవారికి ఆయా సబ్జెక్టుల్లో 10 గ్రేస్ మార్కులు కలిపి పాస్ చేయించాలన్నారు. అంతే కాదు, పదో తరగతి ఫలితాలు సరిగా లేకపోవడానికి కారణం ప్రభుత్వమేనని విరుచుకుపడ్డారు పవన్ కల్యాణ్. ఉపాధ్యాయులకు సంబంధం లేని డ్యూటీలు వేశారని, బోధన కాకుండా ఇతర పనులు వారితో బలవంతంగా చేయించారని, అందుకే పాఠశాలల్లో విద్యా బోధన సరిగా సాగలేదని చెప్పారు పవన్. […]

పదో తరగతి పరీక్ష ఫలితాల శాతం తగ్గిపోవడాన్ని ఏపీలో విపక్షాలు రాజకీయ కోణంలోకి తీసుకొచ్చాయి. నాడు-నేడు విఫలమైందంటూ టీడీపీ మాట్లాడుతోంది. ఈ విమర్శలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు. అసలు పరీక్షలతో సంబంధం లేకుండా అందరినీ పాస్‌ చేయాలని టీడీపీ చెప్పదలుచుకుందా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో నారాయణ, చైతన్య లాంటి విద్యాసంస్థలు క్యాన్సర్‌లా పట్టుకుని.. ప్రభుత్వాన్ని ఆడిస్తూ పరీక్షలకు అర్థం లేకుండా చేశాయన్నారు. బిట్‌ పేపర్ అడ్డం పెట్టుకుని కాపీయింగ్‌ ప్రోత్సహించారని ఆరోపించారు. […]

ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాల వాయిదా తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ శాఖలో సమన్వయ లోపం మరోసారి బయటపడింది. అధికారుల దుందుడుకు చర్యల వల్ల ఇప్పుడు ఈ అంశం రాజకీయ కోణంలోకి వెళ్తోంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు పరీక్ష ఫలితాలు విడుదల చేస్తామని తొలుత విద్యా శాఖ ప్రకటించింది. విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ చేతుల మీదుగా ఫలితాల విడుదల ఉంటుందని ప్రెస్‌ నోట్ పంపారు. అందుకు తగ్గట్టుగానే మీడియా […]