ఆంధ్రప్రదేశ్లో ఉర్దూ భాషను రెండో అధికార భాషగా గుర్తిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో వెంటనే అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉర్దూను అధికారిక భాషగా గుర్తించడంతో ఇకపై రాష్ట్ర ప్రభుత్వ అధికార కార్యకలాపాలు, ఉత్తర, ప్రత్యుత్తరాలు తెలుగుతో పాటు ఉర్దూలో కూడా కొనసాగనున్నాయి. తెలంగాణలో ఉర్దూ ఇప్పటికే రెండో అధికారిక భాషగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఉర్దూకు రాష్ట్ర రెండవ అధికార భాషగా గుర్తింపు దక్కడంపై మంత్రి అంజాద్ బాషా స్పందించారు. […]