అన్నం పెడతామని పిలిచి అవమానిస్తున్నారని వైసీపీ ఓ ట్వీట్ వేసింది. గతిలేక తినడానికి వస్తున్నారని ప్రజలను అవహేళన చేస్తారా..? అని ప్రశ్నించింది.
anna canteens
అన్న క్యాంటీన్లతో పేదల కడుపు నిండుతోంది సరే.. కూటమికి ఓట్లు వేసిన ప్రజలు వీటితోటే సరిపెట్టుకోవాలా అనే ప్రశ్న వినపడుతోంది.
అసలు పథకాలు అమలు చేయండి అని అడుగుతుంటే కొసరు పథకం పట్టాలెక్కించి సూపర్ సిక్స్ మొదలు పెట్టాం అంటూ టీడీపీ నేతలు చంకలు గుద్దుకుంటున్నారని ఎద్దేవా చేస్తున్నారు వైసీపీ నేతలు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా ఉండాలని కోరారు, కానీ ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం విశేషం.