ఏపీలో టెన్త్ ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. గత 20 ఏళ్లలో ఎన్నడూ ఇంత తక్కువ ఉత్తీర్ణత నమోదు కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 67.26 శాతం ఉత్తీర్ణత మాత్రమే నమోదు కావడం, అందులో 70కి పైగా పాఠశాలల్లో ఒక్కరు కూడా పాస్ కాకపోవడంతో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. అసలు పదవ తరగతిలో ఇంత తక్కువ పాస్ పర్సంటేజీ రావడానికి కారణాలేంటని ప్రభుత్వంతో పాటు విద్యావేత్తలు కూడా విశ్లేషిస్తున్నారు. కొన్నేళ్లుగా పదవ తరగతిలో 90 శాతానికి పైగా ఉత్తీర్ణులవుతున్నారు. […]