Andhra Pradesh

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. నియోజకవర్గాల అభివృద్ధి పేరుతో ఎమ్మెల్యేలకు భారీగా నిధులు కేటాయించబోతున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం ఇటీవల ‘గడప గడపకు ప్రభుత్వం’ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. అందరు ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను ఈ ప్రోగ్రాం ద్వారా పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ చోట్ల రోడ్లు, డ్రైనేజీల మీదే ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాల ద్వారా లబ్ది పొందాం.. కానీ ఈ రోడ్లు, […]

అక్రమ కట్టడాలు కూల్చడం కూడా తప్పేనా? అని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలోనైనా సరే అక్రమ కట్టడాలు ఉంటే నిబంధనల ప్రకారం కూల్చేయడం సహజమేనని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని రాజకీయం చేయడం సరికాదన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడాలు నిర్మించుకున్నారని ఆరోపించారు. వాటిని కచ్చితంగా ధ్వంసం చేస్తామని పునరుద్ఘాటించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుకు మతి […]

వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి విజయమ్మ రాజీనామా అంటూ ఫేక్ పోస్ట్.. కుప్పంలో చంద్రబాబుపై విశాల్ పోటీ అంటూ మరో ఫేక్ పోస్ట్.. టీడీపీ అధికారంలోకి వస్తే సచివాలయాలు మూసేస్తాం, వాలంటీర్లను తీసేస్తామంటూ అచ్చెన్నాయుడు చెప్పినట్టు మరో ఫేక్ పోస్ట్.. ఇదీ ఇప్పుడు ఏపీలో జరుగుతున్న ఫేక్ రాజకీయం. ఎవరు ఈ పోస్ట్ లు క్రియేట్ చేస్తారు, ఎవరు వాటిని షేర్ చేస్తారు, అసలు ఇలాంటి వాటి వల్ల ఎవరికి లాభం, ఎంత లాభం అనే విషయాలు […]

ఇటీవలే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కేంద్రం ర్యాంకులు ప్రకటించింది. మొదటి స్థానంలో ఏపీ ఉండగా, టాప్ లిస్ట్ లో తెలంగాణ కూడా చోటు సంపాదించుకుంది. ఈ లిస్ట్ పై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. తమ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లోనే కాదు, పీస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కూడా టాప్ ప్లేస్ లో ఉందని చెప్పారు. ఇక ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందన బీజేపీకి […]

2024 ఎన్నికల్లో కుప్పంలో ఎవరెవరు పోటీ చేస్తారనే విషయంపై రెండేళ్ల ముందుగానే క్లారిటీ వచ్చింది. టీడీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు మరోసారి కుప్పంలో పోటీ చేస్తారా లేదా అనే సందిగ్ధం కూడా ఉంది. కుప్పంలో తగ్గిపోతున్న మెజార్టీ, ఆ మధ్య జరిగిన స్థానిక ఎన్నికల్లో కుప్పం ఎంపీటీసీ స్థానం కోల్పోవడం, ఆ వెంటనే మున్సిపాల్టీ కూడా చేజారడంతో.. అప్పట్లో బాబు ఆలోచనలో పడ్డారని, ఆయన నియోజకవర్గం మార్చేస్తారనే ప్రచారం జరిగింది. చంద్రబాబు కుప్పంనుంచి పారిపోతున్నారని […]

ఏపీఎస్ఆర్టీసీ బస్ చార్జీలు పెంచింది. నేరుగా చార్జీలు పెంచామని చెప్పకుండా డీజిల్ సెస్ పెంచుతున్నట్టు ప్రకటించారు అధికారులు. శుక్రవారం నుంచి పెరిగిన చార్జీలు అమలులోకి వస్తాయి. సిటీ బస్ సర్వీస్ లకు మాత్రం ఇందులో మినహాయింపు ఇచ్చారు. మిగతా సర్వీసులన్నిటికీ టికెట్ చార్జీల పెంపు వర్తిస్తుంది. కరోనా తర్వాత ఇటీవలే ఏపీఎస్ఆర్టీసీ చార్జీలు పెంచింది. అటు తెలంగాణలో మాత్రం రెండుసార్లు చార్జీలు పెరిగాయి. ఇప్పుడు ఏపీలో కూడా రెండోసారి డీజిల్ సెస్ రూపంలో ప్రయాణికులపై భారం మోపేందుకు […]

సొంత పార్టీ నేతలే గోతులు తీస్తున్నారు, కుట్రలు చేస్తున్నారంటూ ఇటీవల కాలంలో వైసీపీ నుంచి కంప్లయింట్ లు ఎక్కువగా వస్తున్నాయి. సాక్షాత్తూ మాజీ మంత్రి, సీఎం జగన్ బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా వైసీపీలో తనకు వ్యతిరేకంగా కొంతమంది పనిచేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ మరుసటి రోజే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తనది కూడా అదే బాధ అన్నారు. తాజాగా.. కర్నూలు వైసీపీలో వెన్నుపోటు వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పార్టీలోనే ఉంటూ […]

ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండాయపల్లిలో 5గురు కూలీల సజీవ దహనం సంఘటనకు ఉడుతే కారణమని తేల్చేరు అధికారులు. వ్యవసాయ కూలీ పనుల కోసం తాడిమర్రి మండలం గుడ్డంపల్లి నుంచి చిల్లకొండయ్యపల్లి కి ఆటో ట్రాలీలో వెళ్తున్న కూలీలపై విద్తుత్తు హైటెన్షన్ తీగలు పడి మంటలు అంటుకొని 5గురు సజీవ దహనమయ్యారు. ఈ సంఘటనపై ప్రాథమిక విచారణ జరిపిన విద్యుత్ అధికారులు ఆ ప్రమాదానికి ఉడుతే కారణమని తేల్చారు. ఉడుత షాట్ అయినప్పుడు లైన్ కట్ […]

ఏపీలో కల్తీ మద్యం అంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి కొడాలి నాని విరుచుకుపడ్డారు. టీడీపీ ఒక కల్తీ పార్టీ అని, కల్తీకి బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబు అంటూ మండిపడ్డారు. ఆయన ఓ కల్తీ నాయుడు, కల్తీ నాయకుడని సెటైర్లు వేశారు నాని. కుళ్లు, కుట్రలు, కుతంత్రాలతో చంద్రబాబు ఒళ్లంతా కుళ్లిపోయిందని విమర్శించారు. విషం ఎక్కడో లేదని, చంద్రబాబు బుర్రలోనే విషం ఉందన్నారు నాని. మీరు తాగి పంపించారా..? గోబెల్స్‌ ప్రచారానికి తాత చంద్రబాబేనంటూ ధ్వజమెత్తిన […]

రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేశారన్న కేసుల్లో రఘురామకృష్ణంరాజును విచారించేందుకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. దేశద్రోహం సెక్షన్‌ మినహా ఇతర సెక్షన్ల కింద దర్యాప్తునకు సహకరించాల్సిందేనని రఘురామకృష్ణంరాజును కోర్టు ఆదేశించింది. ఏపీకి వెళ్తే సీఐడీ అధికారులు తనకు హాని తలపెట్టే ప్రమాదం ఉందని రఘురామ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో విచారణ వేదికపై హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లో విచారించాలని రఘురామ తరపు న్యాయవాది కోరగా.. సీఐడీ తరపు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఆన్‌లైన్ విధానంలో […]