Andhra Pradesh

తెలుగుదేశం మొదటి నుంచి భారీగా నిధులు ఉన్న పార్టీ అని అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ తర్వాత ఆ పార్టీ పగ్గాలు చేపట్టిన చంద్రబాబు.. తమ వర్గపు పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, ఎన్ఆర్ఐల దగ్గర నుంచి భారీగానే నిధులు రాబట్టారు. ఇప్పటికీ తెలుగుదేశానికి నిధుల కొరత పెద్దగా లేదనే ఆ పార్టీ నేతలు చెప్తుంటారు. అయితే గత మూడేళ్లుగా పార్టీ అధికారంలో లేకపోవడం. పార్టీకి ఆసరాగా ఉండే చాలా మంది వ్యాపారవేత్తలు, ఎన్ఐఆర్‌లు కరోనా కారణంగా వెనకడుగు వేయడంతో కొంచెం […]

ఏపీలో అల్లూరి విగ్రహావిష్కరణకు వచ్చిన మోడీకి సీఎం జగన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వినతిపత్రాన్ని సమర్పించారు. భీమవరంలో విగ్రహావిష్కరణ పూర్తయిన తర్వాత ఢిల్లీకి వెళ్లడానికి గన్నవరం ఎయిర్‌పోర్టుకు మోడీ వచ్చారు. అక్కడే ఆయనకు వీడ్కోలు పలికిన వైఎస్ జగన్.. పలు విజ్ఞప్తులతో కూడిన వినతిపత్రాన్ని ఇచ్చారు. ఏపీకి హక్కుగా రావల్సిన నిధులు, గ్రాంట్లతో పాటు విభజన హామీలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలను కూడా జగన్ అందులో ప్రస్తావించారు. తెలంగాణ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల నుంచి […]

ప్రధాని మోడీ ఇవాళ ఏపీలోని భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. హైదరాబాద్ నుంచి నేరుగా భీమవరంకు హెలీకాప్టర్‌లో వెళ్లిన మోడీ.. అక్కడ కార్యక్రమం ముగిసిన తర్వాత అదే హెలీకాప్టర్‌లో గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. మోడీ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకునే సమయంలో ఆయన హెలీకాప్టర్ చూసి కొంత మంది నల్ల బెలూన్లను ఎగురవేసి తమ నిరసనను తెలిపారు. డజన్ల కొద్ది బ్లాక్ బెలూన్స్ మోడీ ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ చుట్టూ ఎగురుతుండటంతో పోలీసులతో పాటు […]

తాను అందరివాడిని అని చెప్పుకుంటున్నా కూడా పవన్ కల్యాణ్ కాపు ఓట్లపై ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. అందుకే ఆయన కాపు సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలను ఎంపిక చేసుకునేవారు. 2024లో పవన్ తిరుపతివైపు చూస్తున్నారనే లెక్కలు కూడా ఇందులో భాగంగానే బయటకు వచ్చాయి. ఇటీవల వంగవీటి రాధాతో నాదెండ్ల మనోహర్ చర్చలు కూడా దీనికి సంకేతంగా చెప్పుకోవచ్చు. అయితే కాపులంతా పవన్ వెంటే ఉన్నారా..? ఆయన్ను గుడ్డిగా నమ్ముతున్నారా..? జనసేనకోసం కష్టపడితే రేపు పవన్, […]

రాష్ట్రంలోని విద్యార్థులందరికీ తాను మామయ్యనని.. ముద్దులు పెడతానంటూ సీఎం జగన్ విద్యార్ధులకు చెప్పారని, ఇప్పుడా ముద్దుల మామయ్య ఎక్కడికెళ్లిపోయారని సెటైర్లు వేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. జనసేన-జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ముద్దుల మామయ్య ఫీజు చెల్లించకపోవడంతో.. పేద విద్యార్థులు విదేశీ విద్యకు దూరమయ్యారని విమర్శించారు. జగన్ కుమార్తె మాత్రం విదేశాల్లో చదువుకుంటోందని, సీఎం కుమార్తె గురించి మాట్లాడటానికి తనకు సంస్కారం అడ్డొస్తోందని అన్నారు. ఏపీలో ఫీజు రీయింబర్స్ మెంట్ కూడా సరిగా జరగడంలేదని చెప్పారు […]

ఒకేసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటనలు పెట్టుకున్నారు నరేంద్రమోదీ. తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న ఆయన, ఏపీలో అల్లూరు సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొనాల్సి ఉంది. తెలంగాణ పర్యటన విషయానికొస్తే.. కనీసం తమకు పోస్టర్లు వేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదని టీఆర్ఎస్ పై ఆరోపణలు గుప్పించారు బీజేపీ నేతలు. మెట్రో పిల్లర్లను కూడా కబ్జా చేశారని, బ్యానర్లలో మోదీని హేళన చేస్తున్నారని కూడా మండిపడ్డారు. అక్కడ టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఫ్లెక్సీల గొడవ జరిగింది. […]

మద్యంతో వైసీపీ నేతలకు నెలకు వచ్చే ఆదాయం 250 కోట్ల రూపాయలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మద్య‌ నిషేధం అని చెప్పిన వ్యక్తే నేడు మద్యం అమ్ముతున్నారని, ఈ మద్యం ద్వారానే వారు నెలకు వ్యక్తిగతంగా ఇన్ని కోట్లు సంపాదిస్తున్నారని ఆయన చెప్పారు. అడ్డగోలుగా లంచాలు తింటున్న వ్యక్తులే అవినీతి నిర్మూలనకు ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టడం హాస్యాస్పదమని, అలాంటివారికి ఉద్యోగులను శిక్షించే అర్హత ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. శనివారం మంగళగిరిలోని తమ […]

మహిళ‌లంటే తనకు అపారమైన‌ గౌరవమని, మగవారిని మహిళలే ముందుండి నడిపించాలని అన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. సైద్ధాంతిక బలం ఉన్న ఆడపడుచులను వెతికి, వెలికి తీయాలనే బలమైన సంకల్పంతో రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభించామని ఆయన చెప్పారు. శనివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన వీర మహిళల తొలి విడత రాజకీయ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. సమాజం బాగుపడాలంటే కచ్చితంగా మహిళలంతా చైతన్యవంతులు కావాలన్నారు. అప్పుడే మార్పు సాధ్యం.. ఇందుకోసమే ఈ […]

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఆవిష్కరించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న మోడీ సోమవారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఏపీకి వస్తారు. విగ్రహావిష్కరణ అనంతరం ప్రధాని భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అదే సమయంలో అల్లూరి సీతారామరాజు కుటుంబ సభ్యులలో ప్రధాని మోడీ […]

పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వర్ రావుకు చెందిన మధుకాన్ గ్రూపు ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) జప్తు చేసింది. రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే కేసులో మధుకాన్ గ్రూపుకు చెందిన 96.21 కోట్ల రూపాయల ఆస్తులను ED ఈ రోజు అటాచ్ చేసింది. రాంచీ, జంషడ్ పూర్ రహదారి నిర్మాణం పేరిట బ్యాంకుల నుంచి మధుకాన్ గ్రూపు 1,030 కోట్ల రూపాయల రుణాలను పొంది ఆ తర్వాత ఆ నిధులను దారి మళ్ళించినట్టు ED […]