తెలంగాణ ఆవిర్భవించి ఎనిమిదేళ్లవుతున్నా.. బీజేపీకి రాష్ట్రంపై కక్ష, వివక్ష అలాగే ఉందని అన్నారు మంత్రి కేటీఆర్. ప్రతీసారి నేతలు వచ్చి స్పీచులు దంచి.. విషం చిమ్మి పత్తా లేకుండా పోవటం అలవాటుగా మార్చుకున్నారని మండిపడ్డారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన నేపథ్యంలో ఆయనకు బహిరంగ లేఖ రాశారు కేటీఆర్. కేంద్రం కడుపు నింపుతున్న తెలంగాణ కడుపు కొట్టడం మంచిది కాదని హితవు పలికారు. తెలంగాణపై అమిత్ షా కి చిత్తశుద్ధి ఉంటే తన […]