తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ భారీ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వేదిక కావడం ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వ్యక్తమవడం సహజం. మోదీ, అమిత్ షా తదితర హేమాహేమీలు తరలిరానున్నారు. మూడురోజుల పాటు వాళ్ళు ఇక్కడే మకాం వేయనున్నారు. దేశవ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లేందుకు బ్లూ ప్రింట్ సిద్ధం చేయడానికి పార్టీ ఉన్నతస్థాయి సమావేశం తలపెట్టారు. జాతీయ కార్యవర్గ సమావేశాలకు గాను తెలంగాణను వ్యూహాత్మకంగానే బీజేపీ ఎంపిక చేసింది. […]