Ambati Rambabu

మోపిదేవి జగన్‌కు అత్యంత సన్నిహితుడని, ఆయన ఓడినా MLC పదవి ఇచ్చి మంత్రిని చేశారని గుర్తుచేశారు. మోపిదేవి పార్టీ వీడతారని తాను అనుకోవడం లేదన్నారు.

రామోజీరావు ఎన్ని ఆర్థిక నేరాలు చేసినా అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు పట్టించుకోలేదని, ఇప్పుడు కూడా రామోజీ వారసులకు ఆయన మద్దతుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు అంబటి రాంబాబు.

పోలవరం ప్రాజెక్టు పనుల్లో చంద్రబాబు నిర్ణయాలన్నీ తప్పని అంబటి చెప్పారు. అయినా చంద్రబాబు తన ఎల్లో మీడియా ద్వారా అదే పనిగా గోబెల్స్‌ ప్రచారం చేశారని ఆయన తెలిపారు.

ధవళేశ్వరం ఆఫీస్ కి కొత్త బీరువాలు వచ్చాయని, వాటిల్లో ఫైళ్లను సర్దేయగా, మిగిలిపోయిన చెత్తను బయట తగలబెట్టారని దాన్ని టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు అంబటి రాంబాబు.

అన్న క్యాంటీన్లను పబ్లిసిటీ స్టంట్ గా కొట్టిపారేశారు అంబటి. రెండు, మూడు వందల మందికి అన్నం పెట్డి, విపరీతంగా పబ్లిసిటీ ఇచ్చుకుంటారని చెప్పారు.

సాగునీటి ప్రాజెక్ట్‌లపై చంద్రబాబు అమాయకంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు అంబటి. కాఫర్‌ డ్యాం లేకుండానే చంద్రబాబు పోలవరం నిర్మిస్తానన్నారని గుర్తు చేశారు.

ఏపీ పోలీసులు విధులు సక్రమంగా నిర్వర్తించకపోతే చరిత్ర వారిని క్షమించదన్నారు అంబటి రాంబాబు.

జగన్‌కు ఏదైనా జరిగితే కూటమి ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు అంబటి రాంబాబు. జగన్ సెక్యూరిటీ విషయంలో చంద్రబాబు జ్ఞానం కోల్పోయి మాట్లాడుతున్నారని, లోకేష్ జ్ఞానం లేకుండా ట్వీట్స్ వేస్తున్నారని విమర్శించారు.

వైసీపీలో ఎవరూ నెంబర్-2 లు లేరని, టీడీపీలో ఉంటారని చెప్పుకొచ్చారు అంబటి రాంబాబు. టీడీపీలో నెంబర్1, 2 ఉన్నారని, బయటి వ్యక్తి నెంబర్-3 గా ఉన్నారని ఎద్దేవా చేశారు.

పార్టీ మారండి, రాష్ట్రం మారండి, కానీ మాట మాత్రం మార్చకండి! అంటూ సూటిగా, స్పష్టంగా షర్మిల వైఖరిని ఎండగట్టారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.