ఎనిమిదేళ్లకు పైనుంచి బీజేపీ కేంద్రంలో వైభోగాన్నిఆస్వాదిస్తోంది. అనేక రాష్ట్రాలలో అధికారంలో ఉంది. అయితే నిశితంగా పరిశీలిస్తే దీర్ఘకాలికంగా బీజేపీ మనుగడ మీద అనుమానపు క్రీనీడలు కమ్ముకున్నాయి. ఈ పరిస్థితి మోదీ ప్రధాని అయిన 2014 నుంచే ఉన్నా గతేడాది కాలంలో మరింత తీవ్రమైంది.