తెలంగాణలో ఎన్నికలకు టైమ్ దగ్గరపడింది. అధికార టీఆర్ఎస్ వినూత్న పథకాలతో ప్రజలలో నమ్మకాన్ని పెంపొందించుకుంటోంది. తనకు ప్రధాన ప్రత్యర్థి అనుకుంటున్న బీజేపీపై విమర్శలతో విరుచుకుపడుతోంది. బీజేపీ కూడా నెలకోసారి కేంద్ర నాయకత్వాన్ని తెలంగాణకు తీసుకొస్తూ హడావిడి చేస్తోంది. ఇటీవల కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీతో సభ నిర్వహించి వరంగల్ డిక్లరేషన్ ప్రకటించారు. ఆ తర్వాత రైతు రచ్చబండ పెట్టారు. అయితే అనుకున్నంత స్థాయిలో ఆ కార్యక్రమాలు సక్సెస్ కాలేదనుకున్నారో ఏమో.. పార్టీ జాతీయ విభాగం చింతన్ శిబిర్ […]