తిరుమల నడకదారి భక్తులు అలిపిరి, శ్రీవారి మెట్టు ద్వారా కొండపైకి చేరుకుంటారు. రెండుచోట్లా మెట్లపై రేకులతో షెడ్లు ఏర్పాటు చేసి ఉంటారు. ఎండ, వాన నుంచి వారికి రక్షణ ఉంటుంది. అయితే అలిపిరి మార్గంలో మోకాలి మెట్టు నుంచి అక్కగార్ల గుడి వరకు రోడ్డుపై నడవాల్సి ఉంటుంది. ఎండవేడి ఎక్కువగా ఉన్న సమయంలో ఆ దారిపై నడవాలంటే కాళ్లు బొబ్బలెక్కుతాయి. కాలినడకన వచ్చే భక్తులు చెప్పులు వేసుకోరు కాబట్టి.. ఆ కాస్త దూరం తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. […]