ప్రతి ఒక్కరికి చదువే నిజమైన ఆస్తి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఏ పేద విద్యార్థి కూడా విద్యకు దూరం కావొద్దనే ఉద్దేశ్యంతో అమ్మఒడి స్కీంను తీసుకొచ్చామని చెప్పారు. ఈ పథకం ద్వారా దాదాపు 80 లక్షల మంది విద్యార్థుల తల్లులకు లబ్ధి చేకూరుతోందని చెప్పారు. సోమవారం ఆయన శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి మైదానంలో బహిరంగ సభలో ప్రసంగించారు. అమ్మఒడి లబ్ధిదారులకు బటన్ నొక్కి నగదు జమ చేశారు. అనంతరం […]