ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్

ఇక‌పై ఎన్నిక‌ల్లో ఒక‌టి కంటే మించి స్థానాల్లో పోటీ చేయాల‌నుకునే రాజ‌కీయ నేత‌ల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం (సీఈసీ) చెక్ పెట్ట‌నుంది. ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల‌ను అన‌ర్హులుగా ప్ర‌క‌టించాల‌ని లేదా భారీ జ‌రిమానాలు విధించాల‌ని సీఈసీ ప్ర‌తిపాదించింది. ఈ మేర‌కు ప్ర‌జా ప్రాతినిధ్య చ‌ట్టానికి స‌వ‌ర‌ణలు చేయాల‌ని కేంద్రానికి సూచించింది. ఈ ప్ర‌తిపాద‌న‌ల‌పై ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ రాజీవ్ కుమార్ ఇటీవ‌ల కేంద్ర న్యాయ‌మంత్రిత్వ శాఖ లెజిస్లేటివ్ కార్య‌ద‌ర్శితో చ‌ర్చించారు. రాజ‌కీయ నాయ‌కులు ఎన్నిక‌ల […]