ఇకపై ఎన్నికల్లో ఒకటి కంటే మించి స్థానాల్లో పోటీ చేయాలనుకునే రాజకీయ నేతలకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) చెక్ పెట్టనుంది. ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్ధులను అనర్హులుగా ప్రకటించాలని లేదా భారీ జరిమానాలు విధించాలని సీఈసీ ప్రతిపాదించింది. ఈ మేరకు ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయాలని కేంద్రానికి సూచించింది. ఈ ప్రతిపాదనలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఇటీవల కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ లెజిస్లేటివ్ కార్యదర్శితో చర్చించారు. రాజకీయ నాయకులు ఎన్నికల […]