ఆటగాళ్ల నిర్లక్ష్య ప్రవర్తన

ఒక టెస్టు, మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడటానికి ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన టీమ్ ఇండియాలో కరోనా మరోసారి కలకలం సృష్టించింది. గత ఏడాది ఐదు టెస్టులు ఆడటానికి వెళ్లిన సమయంలో టీమ్ ఇండియా ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో చివరి టెస్టును వాయిదా వేశారు. ఆ సిరీస్‌లో భాగమైన చివరి టెస్టునే తాజాగా జులై 1 నుంచి ఆడాల్సి ఉన్నది. మ్యాచ్‌కు మరో నాలుగు రోజులే సమయం ఉండగా.. కెప్టెన్ రోహిత్ శర్మ కోవిడ్ బారిన […]