అగ్నిపథ్ పథకం కింద సైన్యంలో చేరి నాలుగేళ్ల తరువాత మళ్లీ ఇంటిముఖం పట్టనున్న అగ్నివీరులు టీచర్లుగా మారనున్నారు. ‘రిటైర్మెంట్’ తరువాత వీరిని స్కూళ్లలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లుగా నియమించే అవకాశాలున్నాయని కేంద్రం ప్రకటించింది. ఈ పథకాన్ని నిరసిస్తూ దేశంలో అనేక చోట్ల యువత హింసాకాండకు దిగుతున్నారని, కానీ ముందుముందు వారి జీవితాన్ని ఉజ్వలంగా మార్చుకునేందుకు ఎన్నో అవకాశాలున్నాయని కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అంటున్నారు. నాలుగేళ్ళ అనంతరం అగ్నివీరులు సైన్యం నుంచి […]