Telugu Global
NEWS

ఆ సిరీస్ పై ఉపాసన స్పెషల్ రివ్యూ

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన సోషల్‌ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు.

ఆ సిరీస్ పై ఉపాసన స్పెషల్ రివ్యూ
X

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన సోషల్‌ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. సామాజిక అంశాలు, హెల్త్, సినిమా.. ఇలా అనేక అంశాలపై తన అభిప్రాయాన్ని షేర్ చేసుకుంటారు. అలానే మెగా ఫ్యామిలీ ఫొటోలను కూడా ఎప్పటికప్పుడు పోస్టు చేస్తూ అభిమానుల్లో కూడా జోష్‌ నింపుతారు. ఇక తాజాగా ఉపాసన ఓ సిరీస్‌కు తన స్టయిల్ లో రివ్యూ ఇచ్చారు. ఇంతకీ ఆ సిరీస్ ఏంటంటే.. కిల్లిన్ డికున్షా దర్శకత్వంలో అనన్య పాండే లీడ్ లో నటించిన ‘కాల్‌ మీ బే’. ఈ సిరీస్‌ పోస్టర్‌ను షేర్ చేసిన ఉపాసన.. ఇది చూశాక తనకు కూడా సోషల్‌ మీడియా జర్నలిస్ట్‌ కావాలనే కోరిక కలిగిందంటూ వ్యాఖ్యానించారు. ఆ సిరీస్‌ తనకు నచ్చిందంటూ టీమ్‌ కు శుభాకాంక్షలు తెలిపారు.

ఇక కాల్ మీ బే సిరీస్ విషయానికి వస్తే.. ఈ వెబ్ సిరీస్ పై మిశ్రమ స్పందన ఉంది. అయితే సారా అలీఖాన్‌, అలియా, నేహా దుఫియా వంటి బాలీవుడ్ స్టార్స్ కూడా ఈ సిరీస్‌పై సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. అనన్య నటనను ప్రశంసిస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండ ‘లైగర్‌’ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన అనన్యకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఆ సినిమా విజయం కాకపోయినా ఆమె నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. కొన్ని సంవత్సరాలుగా మంచి హిట్‌ కోసం ఎదురుచూస్తున్న ఆమెకు ‘కాల్‌ మీ బే’ మంచి ఫలితాన్ని ఇచ్చిందనే చెప్పాలి. ఈ సిరీస్‌ సెప్టెంబర్ 6 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది.

First Published:  11 Sep 2024 11:54 AM GMT
Next Story