Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Thursday, September 11
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»NEWS

    అక్కడ టీఆర్ఎస్ ఇబ్బంది పెట్టింది.. ఇక్కడ ప్రకృతి పగబట్టింది

    By Telugu GlobalJuly 3, 20222 Mins Read
    అక్కడ టీఆర్ఎస్ ఇబ్బంది పెట్టింది.. ఇక్కడ ప్రకృతి పగబట్టింది
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    ఒకేసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటనలు పెట్టుకున్నారు నరేంద్రమోదీ. తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న ఆయన, ఏపీలో అల్లూరు సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొనాల్సి ఉంది. తెలంగాణ పర్యటన విషయానికొస్తే.. కనీసం తమకు పోస్టర్లు వేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదని టీఆర్ఎస్ పై ఆరోపణలు గుప్పించారు బీజేపీ నేతలు. మెట్రో పిల్లర్లను కూడా కబ్జా చేశారని, బ్యానర్లలో మోదీని హేళన చేస్తున్నారని కూడా మండిపడ్డారు. అక్కడ టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఫ్లెక్సీల గొడవ జరిగింది.

    ఇక ఏపీ విషయానికొస్తే.. ఇక్కడ ఎవరూ వారికి అడ్డుపడలేదు.. సో బీజేపీ నేతలకు ఇష్టం వచ్చినట్టు బ్యానర్లు వేసుకున్నారు, ఫ్లెక్సీలు కట్టుకున్నారు. కానీ ఇక్కడ ప్రకృతి బీజేపీపై బగబట్టింది. బ్యానర్లు, ఫ్లెక్సీలు వేసుకున్నంతసేపు వాతావరణం బాగానే ఉంది. కానీ సడన్ గా మోదీ సభ జరగాల్సిన భీమవరంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ప్రధాని పర్యటన సందర్భంగా బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగులు ఈదురు గాలుల ధాటికి నేలకూలాయి. అటు ప్రధాని పాల్గొనాల్సిన సభా ప్రాంగణంలోకి వర్షపు నీరు చేరింది. దీంతో రేపు సభ ఎలాగా అని తలలు పట్టుకున్నారు బీజేపీ నేతలు.

    అక్కడ అవమానం.. ఇక్కడ స్వాగతం..
    తెలంగాణకు ప్రధాని మోదీ వచ్చిన ప్రతిసారీ హైదరాబాద్ లో ఉండకుండా పర్యటనలకు వెళ్లేవారు సీఎం కేసీఆర్. ఈసారి మాత్రం ఆయన నగరంలోనే ఉన్నారు. కానీ మోదీకి స్వాగతం పలికేందుకు ఆయన వెళ్లలేదు, సరికదా అదే సమయంలో రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మాత్రం కేసీఆర్ స్వాగతం పలికారు. అయితే మోదీ ఇక్కడ బీజేపీ కార్యక్రమం కోసం వచ్చారు కాబట్టి, సీఎం కేసీఆర్ ప్రొటోకాల్ పాటించనక్కర్లేదనే వాదన కూడా వినిపిస్తోంది.

    ఏపీలో మాత్రం అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు మోదీ వస్తున్నారు కాబట్టి, సీఎం జగన్ స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి ప్రధాని మోదీ చేరుకుంటారు. గన్నవరం ఎయిర్‌ పోర్టులో ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ స్వాగతం పలుకుతారు.

    అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా భీమవరంలోని సభా ప్రాంగణానికి ప్రధాని మోదీ, సీఎం జగన్ చేరుకుంటారు. కార్యక్రమం అనంతరం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ బహిరంగ సభలో మోదీ, జగన్ పాల్గొంటారు. ఆ తర్వాత గన్నవరం విమానాశ్రయానికి ఇద్దరూ తిరిగి వెళ్తారు, అక్కడ ప్రధానికి సీఎం వీడ్కోలు చెబుతారు. ఇదీ షెడ్యూల్. తెలంగాణలో కేసీఆర్ కనీసం మోదీకి మొహం కూడా చూపించలేదు. ఇక్కడ అధికారిక కార్యక్రమం కాబట్టి.. పర్యటన మొత్తం సీఎం జగన్ ఆయన వెంట ఉంటారు. ఒకేసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో మోదీ పర్యటన కొంచెం ఇష్టం.. కొంచెం కష్టంగా మారింది.

    Andhra Pradesh BJP
    Previous Article‘మద్యంతో వైసీపీ నేతలకు నెలకు వచ్చే ఆదాయం రూ. 250 కోట్లు !’ జనసేనాని
    Next Article ప్రేమించి పెళ్ళి చేసుకున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్… హత్య చేసిన యువతి కుటుంబం
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.