Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Friday, September 12
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»NEWS»International

    పాకిస్తాన్ లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం… ఆహారం కోసం కొట్టుకుంటున్న ప్రజలు

    By Telugu GlobalJanuary 10, 20232 Mins Read
    పాకిస్తాన్ లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం... ఆహారం కోసం కొట్టుకుంటున్న ప్రజలు
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభం తీవ్ర తరమయ్యింది. ప్రజలకు సరిపడ ఆహార పదార్థాలు లేక ఆకలితో అల్లాడి పోతున్నారు. డబ్బులున్నా ఆహారం దొరకని పరిస్థితి నెలకొంది.

    గోధుమలు, గోదుమ‌ పిండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఖైబర్ పఖ్తున్ఖ్వా, సింధ్, బలూచిస్తాన్ ప్రావిన్సులలోని అనేక ప్రాంతాలో గోదుమలు, గోదుమ పిండి కోసం ప్రజలు ఘర్షణలు పడుతున్నారు. తొక్కిసలాటలు జరుగుతున్నాయి. ప్రభుత్వం అందిస్తున్న గోదుమ పిండి కోసం ప్రజలు ప్రతిరోజూ గంటల తరబడి లైన్లలో నిలబడుతున్నారు. గోదుమ పిండి బస్తాలు ఉన్న ప్రభుత్వ లారీలపై, రేషన్ షాపులపై దాడులకు దిగుతున్నారు.

    ప్రభుత్వం సాయుధ గార్డుల కాపలా మధ్య పిండిని పంచుతోంది. అయినప్పటికీ ప్రజల మధ్య ఘర్షణలు తగ్గడం లేదు.

    ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ ప్రకారం, పాకిస్తాన్‌లో గోధుమలు, గోదుమ‌ పిండి ధరలు విపరీతంగా పెరిగాయి. కరాచీలో కిలో పిండిని రూ.140 నుంచి రూ.160కి విక్రయిస్తున్నారు. ఇస్లామాబాద్, పెషావర్‌లలో 10 కిలోల పిండిని కిలో రూ.1,500కు విక్రయిస్తుండగా, 20 కిలోల పిండిని రూ.2,800కి విక్రయిస్తున్నారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని మిల్లు యజమానులు కిలో పిండి ధరను రూ.160కి పెంచారు. బలూచిస్థాన్ ఆహార మంత్రి జమరాక్ అచక్‌జాయ్ ప్రావిన్స్‌లో గోధుమ నిల్వ పూర్తిగా అయిపోయిందని అన్నారు. బలూచిస్థాన్‌కు తక్షణమే 4,00,000 గోధుమల బస్తాలు అవసరమని, లేకుంటే సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

    అదేవిధంగా, ఖైబర్ పఖ్తున్ఖ్వా అత్యంత ఘోరమైన పిండి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది, అక్కడ వ్యాపారులు 20 కిలోల పిండిని 3100 రూపాయలకు విక్రయిస్తున్నారు. ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ‘ది న్యూస్ ఇంటర్నేషనల్’ నివేదించింది.

    సింధ్ ప్రభుత్వం సబ్సిడీ పిండిని ప్రజలకు విక్రయిస్తున్న సమయంలో మిర్పుర్ఖాస్ అనే ప్రాంతంలో జరిగిన తొక్కిసలాటలో ఒక వ్యక్తి మరణించినట్లు ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ నివేదించింది. ప్రభుత్వం 10 కిలోల పిండి బస్తాలను కిలో రూ.65 చొప్పున విక్రయిస్తుండడంతో పిండి బస్తాలు తీసుకొచ్చే వాహనాల చుట్టూ పెద్ద ఎత్తున గుమిగూడిన ప్రజలు ఒకరినొకరు తోసుకున్నారు.

    ఈ గందరగోళంలో 40 ఏళ్ల కార్మికుడు హర్‌సింగ్ కొల్హి రోడ్డుపై పడిపోయాడని, వందలాది మంది ప్రజల కాళ్ళ కింద పడి అతను చనిపోయాడని పోలీసులు తెలిపారు.

    పెషావర్‌లోని నివాసి ఒకరు చేసిన ట్వీట్ ప్రకారం, పేదలు, ధనవంతుల కూడా గోధుమ పిండి గురించి ఆందోళన చెందుతున్నారని వెల్లడించారు. ఒక వ్యక్తి వారానికి ఒకసారి మాత్రమే పిండి కొనుగోలు చేయగలరని అతను తెలిపారు.

    రొట్టెల ధరలు విపరీతంగా పెరిగాయి. అన్ని బేకరీ వస్తువులను అధిక ధరకు విక్రయిస్తున్నారు. ధరలు పెరగడంతో ప్రతి రోజూ గొడవలు కూడా అవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం, పిష్టఖారాలో ఇద్దరు స్థానికులు రొట్టె ధరపై హోటెల్ యజమానితో గొడవపడి అతనిపై కాల్పులు జరపడంతో ఒక బాటసారి మరణించాడు.

    పాకిస్తాన్‌లో గోధుమ సంక్షోభానికి కేద్ర ప్రభుత్వం, పంజాబ్ ప్రభుత్వాల మధ్య గొడవలే కారణమని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ నివేదించింది. ఎంత గోధుమలను దిగుమతి చేసుకోవాలో సరిగ్గా అంచనా వేయడంలో పంజాబ్ ఆహార శాఖ విఫలమైందని తెలుస్తోంది. 

    Pakistan में ये लड़ाई…ये झगड़ा…ये दंगे जैसे हालात आटे की बोरी के लिए हो रहे हैं…#PakistanEconomy #Pakistan pic.twitter.com/EzoI2LoSc9

    — Jyot Jeet (@activistjyot) January 9, 2023

    Pakistan Severe economic crisi
    Previous Articleసూదంటురాళ్ళు
    Next Article నేపాల్ ప్రధానిగా అత్యంత మెజార్టీతో ప్రచండ ఎన్నిక‌
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.