Telugu Global
NEWS

హేమకు మళ్లీ నోటీసులు.. ఈసారి ఏ సాకు చెప్తారో!

తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు బెంగళూరు పోలీసులు. తాజా నోటీసులతో హేమ విచారణకు హాజరవుతారా.. లేదా అనేది ఉత్కంఠగా మారింది.

హేమకు మళ్లీ నోటీసులు.. ఈసారి ఏ సాకు చెప్తారో!
X

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్‌ నటి హేమకు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. జూన్‌ ఒకటిన అంటే శనివారం విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

హేమతో పాటు 8 మందికి సోమవారం విచారణకు హాజరుకావాలని గతంలో నోటీసులు పంపగా.. జ్వరం వచ్చింది విచారణకు రాలేనని సమాధానం ఇచ్చారు హేమ. దీంతో తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు బెంగళూరు పోలీసులు. తాజా నోటీసులతో హేమ విచారణకు హాజరవుతారా.. లేదా అనేది ఉత్కంఠగా మారింది.

తాను బెంగళూరు రేవ్‌ పార్టీలో పాల్గొనలేదని చెప్పిన హేమ.. పోలీసుల నోటీసులతో మాట మార్చారు. ఈ పార్టీలో హేమతో పాటు మొత్తం 86 మంది డ్రగ్స్‌ తీసుకున్నట్లు రిపోర్టుల్లో తేలింది. రేవ్‌ పార్టీ ఏర్పాటు చేసిన వాసుతో పాటు అరుణ్‌, సిద్దికి, నాగబాబుతో పాటు సహా ఐదుగురిని అరెస్టు చేశారు బెంగళూరు పోలీసులు. వీరిని 10 రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ మే 27న ఆదేశాలు జారీ చేసింది కోర్టు.

First Published:  29 May 2024 6:43 AM GMT
Next Story