Telugu Global
National

ముగిసిన రాష్ట్రపతి హైదరాబాద్‌ పర్యటన

వీడ్కోలు పలికిన గవర్నర్‌, మంత్రులు

ముగిసిన రాష్ట్రపతి హైదరాబాద్‌ పర్యటన
X

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌ పర్యటన ముగిసింది. ఒక రోజు హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి శనివారం ఉదయం హైదరాబాద్‌ కు చేరుకున్నారు. నల్సార్‌ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొని లా గ్రాడ్యుయేట్లకు పట్టాలు అందజేశారు. సాయంత్రం బేగంపేట ఎయిర్‌ పోర్టులో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు హార్కర వేణుగోపాల్ రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు పలికారు.

First Published:  28 Sept 2024 2:41 PM GMT
Next Story