Telugu Global
National

పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్‌ రైలు.. 11 మందికి గాయాలు

సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. అధికారులు తక్షణం స్పందించి సహాయక చర్యలు ప్రారంభించారు.

పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్‌ రైలు.. 11 మందికి గాయాలు
X

జార్ఖండ్‌లో హావ్‌డా – సీఎస్‌ఎంటీ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో 11 మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు. వారిలో ఆరుగురు తీవ్రంగా గాయప‌డిన‌ట్టు అధికారులు వెల్లడించారు. మరో ఐదుగురు స్వల్ప గాయాలతో ప్రాథమిక చికిత్స పొందుతున్నారని తెలిపారు.

జార్ఖండ్‌లోని చక్రధర్‌పూర్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. హావ్‌డా నుంచి సీఎస్‌ఎంటీకి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. అధికారులు తక్షణం స్పందించి సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రయాణికులను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

First Published:  30 July 2024 4:09 AM GMT
Next Story