Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Thursday, September 11
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»NEWS»National

    జాతీయ పసుపు బోర్డు ప్రారంభం

    By Raju AsariJanuary 14, 20251 Min Read
    జాతీయ పసుపు బోర్డు ప్రారంభం
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    నిజామాబాద్‌ జిల్లా రైతుల చిరకాల వాంఛ నెరవేరింది. జాతీయ పసుపు బోర్డు నిజామాబాద్‌లో ఏర్పాటైంది. కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వర్చువల్‌గా దీన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పాల్గొన్నారు. పీయూష్‌ గోయెల్‌ను ఆయన పసుపు కొమ్మల దండతో సత్కరించారు.

    నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా 2023 అక్టోబర్‌ 1న మహబూబ్‌నగర్‌ సభలో ప్రధాని మోడీ ప్రకటించారు. ఆ తర్వాత అక్టోబర్‌ 4న కేంద్ర వాణిజ్యశాఖ దీనిపై గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసేది అందులో పేర్కొనలేదు. తాజాగా నిజామాబాద్‌లో బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. దానికి ఛైర్మన్‌గా నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌ గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు పల్లె గంగారెడ్డిని నియమించింది. మూడేళ్ల పాటు ఈ పదవిలో ఆయన కొనసాగనున్నారు. నేటి నుంచి నిజామాబాద్‌ కేంద్రం పసుపు బోర్డు కార్యకలాపాలు మొదలవుతాయి. నిజామాబాద్‌ జిల్లాలో పసుపు బోర్డు ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది. పీయూష్‌ గోయెల్‌ దీన్నిప్రారంభిస్తారు.

    ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్‌ మాట్లాడుతూ.. సంక్రాంతి రోజు పసుపు బోర్డు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మోడీ ఆశ్వీర్వాదంతో పసుపు బోర్డు మంజూరు చేశామన్నారు. తొలి ఛైర్మన్‌గా నియమితులైన గంగారెడ్డి శుభాకాంక్షలు.

    పసుపు బోర్డు ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇవాళ పసుపు బోర్డు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. గతంలో చాలామంది పసుపు బోర్డు గురించి మాట్లాడి సాధించలేదు. తెలంగాణ ప్రజల తరఫున పీయూష్‌ గోయెల్‌కు ధన్యవాదాలు తెలిపారు. 

    Launched National Turmeric Board
    Previous Articleఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డికి బెయిల్‌ మంజూరు
    Next Article అర్ధరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?
    Raju Asari

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.