కుంభమేళాలో భక్తుల.. రద్దీ.. అమల్లోకి కఠిన ఆంక్షలు
నేడు ఉదయం 4 గంటల నుంచి కుంభమేళా ప్రాంతాన్ని 'నో వెహికల్ జోన్'గా మార్పు
BY Raju Asari11 Feb 2025 11:43 AM IST
![కుంభమేళాలో భక్తుల.. రద్దీ.. అమల్లోకి కఠిన ఆంక్షలు కుంభమేళాలో భక్తుల.. రద్దీ.. అమల్లోకి కఠిన ఆంక్షలు](https://www.teluguglobal.com/h-upload/2025/02/11/1402316-maha-kumbh-2025.webp)
X
Raju Asari Updated On: 11 Feb 2025 11:43 AM IST
ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమ సందర్భంగా ప్రయాగ్రాజ్కు భారీ భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వీలుగా కఠిన ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చారు. నేడు ఉదయం 4 గంటల నుంచి కుంభమేళా ప్రాంతాన్ని 'నో వెహికల్ జోన్'గా మార్పు చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి ప్రయాగ్రాజ్ మొత్తాన్ని నో వెహికల్ జోన్గా మారుస్తామని అధికారులు తెలిపారు. ప్రయాగ్రాజ్లో నిత్యం 1.44 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానం చేస్తున్నారని అధికారులు తెలిపారు.
Next Story