విభజన అంశాలపై కేంద్ర హోం శాఖ కీలక భేటీ
సమావేశానికి హాజరైన ఏపీ, తెలంగాణ సీఎస్లు, ఇతర అధికారులు
BY Raju Asari3 Feb 2025 12:57 PM IST
X
Raju Asari Updated On: 3 Feb 2025 12:57 PM IST
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అంశాలపై కేంద్ర హోం శాఖ కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. హోం శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ సీఎస్లు, ఇతర అధికారులు హాజరయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా పరిష్కారం కాని ప్రధానాంశాలపై అధికారులు చర్చిస్తున్నారు. విభజన చట్టం ప్రకారం కేంద్రం నుంచి రావాల్సిన నిధులపైనా ఈ భేటీలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
Next Story