Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Thursday, September 11
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»NEWS»National

    ఏఐ సాయంతో బాధితులకు న్యాయం జరిగేలా చూడాలి: రాష్ట్రపతి

    By Raju AsariSeptember 28, 20241 Min Read
    ఏఐ సాయంతో బాధితులకు న్యాయం జరిగేలా చూడాలి: రాష్ట్రపతి
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు సాంకేతికంగా ఎన్నో మార్పులు వస్తున్నాయని, న్యాయ వ్యవస్థ కూడా కృత్రిమ మేధ (ఏఐ)ను మరింత వినియోగించుకుని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. నల్సార్‌ లా యూనివర్సిటీ నిర్వహించిన 21వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ధనికులతో పోలిస్తే పేదలు న్యాయం పొందలేకపోతున్నారని.. మెరుగైన సమాజాం కోసం ఈ విధానంలో మార్పు రావాలన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో మహాత్మాగాంధీ న్యాయబద్ధంగా సత్యాగ్రహ దీక్ష చేసి ఆదర్శంగా నిలిచారని ముర్ము అన్నారు. నిబద్ధత, పారదర్శకంగా పనిచేస్తే న్యాయవాద వృత్తిలో ఎంతో ఎత్తునకు ఎదగొచ్చని తెలిపారు.

    ఈ సందర్భంగా పీహెచ్‌డీ, ఎల్‌ఎల్‌ఎంలో ఉత్తమ ప్రతిభ చాటినవారికి విద్యార్థులకు రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారం పతకాలు అందించారు. ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ పి.ఎస్‌ నరసింహ, హైకోర్టు సీజే జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, వైస్‌ ఛాన్స్‌లర్‌ శ్రీకృష్ణదేవ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీజే జస్టిస్‌ ఆలోక్‌ అరాధే రాష్ట్రపతికి జ్ఞాపికను బహుకరించారు.

    అంతకుముందు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, సీతక్క, సీఎస్‌ శాంతి కుమారి, డీజీపీ జితేందర్‌ స్వాగతం పలికారు. 

    NALSAR University President Droupadi Murmu
    Previous Article‘బెండకాయ జ్యూస్‌ ఎందుకు?’ అంటూ మంచులక్ష్మి ప్రశ్న
    Next Article ఇండియాలో రోల్స్ రాయిస్ కలినన్ సిరీస్-2 కారు లాంచ్… ధర ఎంతంటే?
    Raju Asari

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.