Telugu Global
National

అతివేగం.. ఒకే కుటుంబంలోని 8 మంది దుర్మరణం

మృతుల్లో ఒక పోలీస్ ఆఫీసర్, ఇద్దరు మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు. చనిపోయిన ఐదుగురు చిన్నారులు 6 నుంచి 16 మధ్య వ‌య‌సు వారే.

అతివేగం.. ఒకే కుటుంబంలోని 8 మంది దుర్మరణం
X

జ‌మ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగం ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ప్రాణం తీసింది. డుక్సుమ్‌ అనే ప్రాంతం దగ్గర వేగంగా వెళ్తున్న ఓ టాటా సుమో స్కిడ్‌ అయి లోయలోకి దూసుకెళ్లింది. పల్టీలు కొట్టడంతో వాహనం నుజ్జునుజ్జయింది. దీంతో 8 మంది స్పాట్‌లోనే మృతిచెందారు.

మృతులంతా కిష్టవార్‌ జిల్లాకు చెందివారు. తమ స్వ‌స్థ‌లానికి చేరుకునే క్రమంలో మార్గమధ్యలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఒక పోలీస్ ఆఫీసర్, ఇద్దరు మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు. చనిపోయిన ఐదుగురు చిన్నారులు 6 నుంచి 16 మధ్య వ‌య‌సు వారే. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు స్పాట్‌కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను బయటకు తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ప్రమాదంలో చనిపోవడంతో వారి బంధువులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు.

First Published:  27 July 2024 12:43 PM GMT
Next Story