Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Friday, September 12
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»NEWS»International

    ఐక్యరాజ్య సమితి సమావేశానికి నిత్యానంద ‘కైలాస’ రాయబారి హాజరు

    By Telugu GlobalFebruary 28, 20232 Mins Read
    ఐక్యరాజ్య సమితి సమావేశానికి నిత్యానంద 'కైలాస' రాయబారి హాజరు
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    తనను తాను దైవాంశ సంభూతుడిగా చెప్పుకునే నిత్యానంద స్వామి.. కొత్తగా కైలాస అనే దేశాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. కైలాస అనే దేశం అసలు ఉన్నదా లేదా? ఉంటే దానికి గుర్తింపు ఉందా? ఆ దేశం కచ్చితంగా ఎక్కడ ఉన్నది? అని భారతీయులకు చాలా అనుమానాలు ఉన్నాయి. అయితే ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ.. అనూహ్యంగా కైలాస ప్రతినిధి ఒకరు ఐక్యరాజ్య సమితి సమావేశానికి హాజరయ్యారు. ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస’ తరపున మాతా విజయ ప్రియా నిత్యానంద అనే మహిళ ఐక్యరాజ్య సమితి సమావేశానికి హాజరయ్యారు.

    ఫిబ్రవరి 22న ఐక్యరాజ్య సమితికి చెందిన కమిటీ ఆన్ ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ రైట్స్ (సీఈఎస్ఆర్) సమావేశం జెనీవాలో నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీని ఐక్యరాజ్య సమితి తమ వెబ్‌సైట్‌లో ఉంచింది. అందులో విజయ ప్రియ నిత్యానంద.. కైలాసకు శాశ్వత రాయబారి అనే హోదాలో కనిపించారు. ఆ సమావేశంలో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు అనే విషయంపై చర్చ జరగగా.. ఆమె కూడా మాట్లాడారు. అంతే కాకుండా తమ దేశ వ్యవస్థాపకుడు నిత్యానందపై.. తాను పుట్టిన భారత దేశం వేధింపులకు గురి చేస్తోందని ఫిర్యాదు కూడా చేశారు.

    కైలాస ప్రపంచంలోనే మొట్టమొదటి సార్వభౌమ హిందూ దేశంగా ఆమె పేర్కొన్నారు. నిత్యానంద హిందూయిజానికి అత్యున్నత మతాధికారని కూడా ఆ సమావేశంలో తెలిపారు. నిత్యానంద మరుగున పడిన 10వేల హిందూ సంప్రదాయాలను పునరుద్దరిస్తున్నారని ఆమె వెల్లడించారు. హిందూయిజాన్ని రక్షించడానికి, సరికొత్త విధానాలు రూపొందించడానికి కైలాస దేశం కృషి చేస్తోందని ఆమె ఐక్యరాజ్య సమితికి తెలిపారు. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు సాధించడంలో కైలాస చాలా విజయవంతమైందని ఆమె వెల్లడించారు.

    కాగా, 2019 నవంబర్‌లో నిత్యానందపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. గుజరాత్ పోలీసులు నిత్యానంద ఆశ్రమం నుంచి ఒక చిన్నారి కిడ్నాప్ అయిన కేసులో దర్యాప్తు కూడా ప్రారంభించారు. అదే సమయంలో దేశం విడిచి వెళ్లిపోయిన నిత్యానంద.. కైలాస అనే దేశాన్ని గుర్తు తెలియని ప్రదేశంలో నెలకొల్పారు. దానికి గుర్తింపు ఇవ్వాలని పలుమార్లు ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి కూడా చేశారు. ఈ క్రమంలో కైలాస శాశ్వత రాయబారి ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాల్గొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

    USK at UN Geneva: Inputs on the Achievement of Sustainability

    Participation of the United States of KAILASA in a discussion on the General Comment on Economic, Social and Cultural Rights and Sustainable Development at the United Nations in Geneva

    The Economic, Social, and… pic.twitter.com/pNoAkWOas8

    — KAILASA’s SPH Nithyananda (@SriNithyananda) February 25, 2023

    Nityananda United States of Kailasa
    Previous Articleకాళ్లు, చేతులు తరచూ తిమ్మిర్లు పడుతున్నాయా? మీకు ఆ విటమిన్ లోపం ఉన్నట్లే!
    Next Article రాయి రాగాలు పాడుతుంది (కవిత)
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.