International
ఎరోల్ మస్క్ ‘ది సన్’ పత్రికతో వెల్లడిస్తూ ‘మనం ఈ భూమ్మీద ఉన్నది పునరుత్పత్తి కోసమే’ అంటూ వ్యాఖ్యానించారు.
1985 ఎయిర్ ఇండియన్ బాంబు పేలుళ్ల కేసులో నిందితుల్లో ఒకరైన రిపుదమన్ సింగ్ మాలిక్ ను గురువారంనాడు గుర్తు తెలియని వ్యక్తులు కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో…
బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి జరుగుతున్న ఓటింగ్లో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు, బ్రిటన్ ఆర్థిక శాఖ మాజీ మంత్రి రిషి సునాక్ తొలి రౌండ్ లో విజయం సాధించారు .
జపాన్ లో కొత్త చట్టం అమలులోకి వచ్చింది. దీని ప్రకారం ఆన్ లైన్ లో ఎవరినైనా అవమానించినట్టు తేలితే ఏడాదిపాటు జైలు శిక్ష విధిస్తారు. లేదా 3 లక్షల యెన్ లు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఈ చట్టం తీసుకొచ్చినట్టు జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే అవమానం అంటే పూర్తి స్థాయిలో నిర్వచనం ఇవ్వలేకపోయింది ప్రభుత్వం. ఈ చట్టం భావప్రకటనా స్వేచ్ఛపై ప్రభావం చూపుతుందో లేదో తెలుసుకోవడానికి 2025లో మళ్లీ దీన్ని […]
శ్రీలంక ఆర్థిక పరిస్థితులు రోజు రోజుకీ దిగజారుతున్నాయి. ఏం కొనేటట్టులేదు, ఏం తినేటట్టులేదు. చివరకు ఓ మోస్తరు ధనవంతులు కూడా రోడ్డునపడే పరిస్థితి. ప్రస్తుతం శ్రీలంక వాసుల్ని ఇంధన కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో అక్కడ కట్టెలపొయ్యిలే దిక్కయ్యాయి. అపార్ట్ మెంట్లలో ఉండేవారు కూడా కిందకు దిగొచ్చి కట్టెలపొయ్యిపై వంట చేసుకుంటున్నారు. కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. కిలో క్యారెట్ రూ.490గా ఉండగా.. కిలో ఉల్లి 200కు చేరింది. బంగాళా దుంప కేజీ రూ.220 గా ఉంది. గ్రాము […]
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించారా? భార్యతో సహా ఆయన దుబాయ్ వెళ్తుండగా ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. శ్రీలంకను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి, ప్రజల జీవనాన్ని అస్తవ్యస్తం చేసిన అధ్యక్షుడు గొటబాయ రాజపక్సపై ఆ దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే. గతవారం ఏకంగా అధ్యక్ష భవనంపై వేలాది మంది ప్రజలు దాడి చేసి ఆక్రమించుకున్నారు. అంతకు ముందే భవనాన్ని వదిలి గొటబాయ అజ్ఞాతంలోకి […]
దేశంలో రేగిన నిరసనలతో భయపడి పారిపోయినట్టు చెబుతున్న శీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే రాజధాని కొలంబోలోనే ఉన్నారట.. . అయితే దాదాపు 4 రోజులు ఎక్కడున్నారో తెలియదు గానీ వచ్చీ రాగానే త్రివిధ దళాల కమాండర్లతోను, డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ తోను సమావేశమై తాజా పరిణామాల గురించి చర్చించినట్టు తెలుస్తోంది. ఆయన రేపు రాజీనామా చేసే అవకాశాలున్నాయి. ఆయన ఈ నెల 9 న దేశం వదిలి పారిపోయాడని వచ్చిన వార్తలను పార్లమెంట్ స్పీకర్ మహీందా తోసిపుచ్చారు. […]
లంక రావణకాష్టానికి ఆద్యుడై, ఆందోళనకారుల దాడులతో భయపడి పలాయనం చిత్తగించిన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే ఎక్కడున్నాడో గానీ మొత్తానికి నేను ఎక్కడో ఒకచోట తలదాచుకున్నానని ప్రపపంచానికి తెలియజేశాడు. బ్యాక్ టు యాక్షన్ అనిపించుకున్నాడు. రెండు రోజులు గడిచినా ఆచూకీ పత్తాలేని గొటబాయ ఓ ఆర్డర్ జారీ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇంధనం కొరతతో అల్లాడుతున్న తమ దేశంలో వంట గ్యాస్ సక్రమంగా పంపిణీ అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించాడు. ఈ మేరకు కొలంబోలోని ఆయన ప్రధాన […]
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్న సంగతి తెలిసిందే. నిత్యావసరాలు, చమురు, మెడిసిన్స్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బంకుల్లో పెట్రోల్, డీజిల్ రేషన్ ప్రకారం పోస్తున్నారు. ఏప్రిల్ నుంచి దేశంలో అధ్యక్షుడు గొటబయకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. రాజపక్స కుటుంబం కారణంగానే దేశం ఇంత అప్పుల్లో కూరుకొని పోయిందని శ్రీలంక ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే గొటబయ సోదరుడు మహింద రాజపక్స ఎప్పుడో ప్రధాని పదవికి రాజీనామా చేశాడు. ఆయన స్థానంలో విక్రమ […]
రావణ కాష్టాన్ని మించి శ్రీలంకలో అగ్గి రాజుకుంది. ఆందోళనకారుల హింసాత్మక నిరసనలతో అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే కొలంబో నుంచి పారిపోగా, ప్రధాని రణిల్ విక్రమసింఘే పదవికి రాజీనామా చేశారు. కానీ దీనితో సంతృప్తి చెందని నిరసనకారులు ఆయన ఇంటికి, కార్యాలయానికి కూడా నిప్పు పెట్టారు. కొంతమంది ఎంపీలపై దాడులు చేశారు. గొటబాయ ఈ నెల 13 న రాజీనామా చేస్తారని పార్లమెంట్ స్పీకర్ మహీందా ప్రకటించినప్పటికీ, దేశంలో పరిస్థితి చల్లారేట్టు కనిపించడంలేదు. ఇక లంక రాజ్యాంగ నియమావళి […]