International

తమకు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్నాయని పాశ్చాత్య సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ల మీద రష్యా ఆగ్రహంగాఉంది. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లను ఉగ్ర‌వాద సంస్థలుగా ప్రకటించింది.

ఉక్రెయిన్ పై రష్యా మళ్ళీ దాడి తీవ్రతరం చేసింది. క్రిమియా వంతెనను ఉక్రెయిన్ దళాలు కూల్చివేయడంతో ఆగ్రహం మీద ఉన్న రష్యా, ఉక్రెయిన్ లోని ప‌లు న‌గ‌రాలపై క్షిపణులు దాడులు చేస్తోంది.

ఇరాన్ లో హిజాబ్ కు వ్యతిరేకంగా మహిళలు చేస్తున్న ఉద్యమంలో….పోలీసు కాల్పుల వల్ల ఇప్పటి వర‌కు 185 మంది మృతి చెందగా అందులో 19 మంది చిన్నారులున్నారు. ఆదివారంనాడు ఇరాన్ లో మళ్ళీ పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి.

ఇన్ఫోసిస్ లో వయస్సు, లింగభేదం, జాతీయత ఆధారంగా వివక్ష ఉందని అమెరికా కోర్టులో కేసు విచారణ జరుగుతోంది. భారతీయ సంతతికి చెందిన అభ్యర్థులు, పిల్లలు ఉన్న మహిళలు ,50 ఏళ్లు పైబడిన అభ్యర్థులను నియమించుకోవద్దని సంస్థ త‌న‌ను కోరినట్లు ఇన్ఫోసిస్‌ టాలెంట్ అక్విజిషన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ జిల్ ప్రీజీన్ ఆరోపించారు.

చాలా మంది కంపెనీని వీడి ఇతర సంస్థల్లో చేరడానికి మొగ్గు చూపుతున్నట్లు మొదట్లో వార్తలు వచ్చాయి. కానీ, వారిని తొలగిస్తుండటమే అసలు కారణమని.. చాలా మంది ఉద్యోగుల ఇంకా ప్రత్యామ్నాయాలను కూడా వెతుక్కోలేదని తెలుస్తున్నది.

ముస్లింలపై చైనా పాల్పడుతున్న మానవ హక్కుల ఉల్లంఘన, అణిచివేత పై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి లో ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని ఓడించడంలో భారత్ తన వంతు పాత్ర పోషించింది. ఓటింగ్ ను బహిష్కరించి పరోక్షంగా చైనాకు సహకరించింది.

సాహిత్యంలో నోబెల్ బహుమతి ఫ్రెంచ్ రచయిత్రి అన్నీ ఎర్నాక్స్ కు దక్కింది. ‘ఫర్ ద కరేజ్ అండ్ క్లినికల్ ఆక్యుటీ’ పేరుతో ఆమెరాసిన పుస్తకానికి ఈ బహుమతి లభించింది.

థాయ్‌లాండ్ లో జరిగిన దారుణమైన ఘటనలో 34 మంది మృతి చెందారు. ఓ డే కేర్ సెంటర్ లో మాజీ పోలీసు అధికారి జరిపిన‌ విచ్చలవిడి కాల్పుల్లో 22 మంది పిల్లలతో సహా 34 మంది మరణించినట్టు అధికారులు ప్రకటించారు.

కిడ్నాప్‌కు గురైనవారిలో ఒకరి బ్యాంకు ఏటీఎం కార్డు ఉపయోగించినట్లు గుర్తించి ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. సీసీ టీవీ ఫుటేజీలోని దుండగుడి ఫొటోను కూడా పోలీసులు విడుదల చేశారు. అయితే, ఈ దర్యాప్తు కొనసాగుతుండగానే సమీపంలోని ఓ తోటలో నలుగురి శవాలను గుర్తించారు.

క్లిక్‌ కెమిస్ట్రీతోపాటు బయోఆర్థోగోనల్‌ కెమిస్ట్రీలను అభివృద్ధి చేసినందుకు గానూ శాస్త్రవేత్తలు కరోలిన్‌ ఆర్‌ బెర్టోజీ, మార్టెన్‌ మెల్డల్‌, కే బ్యారీ షార్ప్‌లెస్‌లను ఈ ఏడాది నోబెల్‌ పురస్కారానికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ తెలిపింది.