International

Earthquake in Indonesia: ఇండోనేషియాలోని ప్రధాన ద్వీపం జావాలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. భూకంపం ప్ర‌భావంతో భ‌వ‌నాలు కుప్ప‌కూలాయి. అనేక మంది భ‌వ‌నాల శిథిలాల్లో చిక్కుకుని ఉన్నారు.

ట్రంప్ ఖాతా పున‌రుద్ధ‌రించాలా.. వ‌ద్దా.. అంటూ నిర్వ‌హించిన ఒపీనియ‌న్ పోల్‌కి 51.8 శాతం మంది అనుకూలంగా, వ‌ద్దంటూ 48.2 మంది వ్య‌తిరేకంగా ఓటు చేశారు.

‘ఇక్కడ భారతీయుల ఫోటోలు తీయబడవు’ అంటూ ఆస్ట్రేలియాలో ఓ పోస్టాఫీస్ ముందు పెట్టిన బోర్డు ఆ దేశంలో తీవ్ర దుమారం రేపింది. చివరకు ఆ పోస్టాఫీసు భారతీయులకు క్షమాపణలు చెప్పింది

“#RIPTwitter” అనే హ్యాష్‌ట్యాగ్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ట్విట్టర్ లో టాప్ ట్రెండింగ్‌లో న‌డుస్తోంది. ‘హార్డ్‌కోర్’ ట్విట్ట‌ర్ ఉద్యోగులు కంపెనీని విడిచిపోవ‌డంతోనే ఈ ప‌రిస్థితి వ‌చ్చింద‌నే వార్త‌లు వెల్లువెత్తుతున్నాయి.

యూఎన్ఎస్‌సీ ప్రతీ ఏడాది నిర్వహించే భద్రతా మండలి సంస్కరణల చర్చా కార్యక్రమంలో భారత్‌కు బ్రిటన్ మరోసారి మద్దతు పలికింది.

ట్విట్ట‌ర్ ను కొనుగోలు చేశాక ఎలాన్ మస్క్ ఉద్యోగులందరినీ తొలగిస్తున్న నేపథ్యంలో మిగిలి ఉన్న ఉద్యోగులు కూడా సామూహిక రాజీనామాలకు సిద్దమవుతున్నారు. ఓ సంస్థ నిర్వహించిన పోల్‌లో ఉద్యోగుల్లో 42 శాతం మంది సంస్థను వదిలివెళ్లేందుకే మొగ్గు చూపారు. పావువంతు మంది మాత్రం అయిష్టంగానే కొనసాగేందుకు ఇష్టపడ్డారు.

ప్రపంచంలో నెంబర్ 1 ప్లాస్టిక్ కాలుష్య కారకురాలైన కోకాకాకోలా కంపెనీ ‘ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తున్న ప్రపంచ వాతావరణ మార్పు సదస్సుకు స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ కాలుష్యంపై ఐక్యరాజ్యసమితి చేసే పోరాటంలోని నిజాయితీపై అనుమానాలు రెకెత్తుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 3.5 లక్షల మంది password అనే పదాన్ని పాస్‌వర్డ్‌గా ఉపయోగిస్తున్నారట. ‘బిగ్ బాస్కెట్’ అనే పదాన్ని 75 వేల మంది పాస్‌వర్డ్‌గా పెట్టుకోవడం మరో విశేషం.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 43కోట్లకు పైగా ప్రజలు ప్రస్తుతం వినికిడి లోపంతో బాధపడుతున్నారు. ఇక హెడ్‌ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, ఇయర్‌బడ్‌లను ఉపయోగించడం వల్ల 100 కోట్ల మందికిపైగా ప్రజలు వినికిడి సమస్య‌ ముప్పును ఎదుర్కోనున్నారు.

డిసెంబర్ 1 నుంచి జీ-20 అధ్యక్ష బాధ్యతలు భారత్ నిర్వర్తించనున్నది. ఈ నెల 8న భారత్‌లో జరుగనున్న జీ-20 సదస్సు లోగో, థీమ్, వెబ్‌సైట్‌ను ప్రధాని మోడీ ఆవిష్కరించారు.