International
బాంగ్లా దేశ్ లో శుక్రవారం భద్రతా బలగాలు బీఎన్పీ పార్టీ ప్రధాన కార్యాలయంలోకి ప్రవేశించి కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో బీఎన్పీకి చెందిన ఒక నేత మృతి చెందారు. దీంతో ప్రజల్లో, విపక్షాల్లో ప్రభుత్వం చేపట్టిన చర్యపై ఆగ్రహం పెల్లుబికింది. ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేయాలని శనివారం ప్రజలు భారీ సంఖ్యలో రోడ్లపై చేరుకొని నిరసన వ్యక్తం చేశారు.
ఉద్దేశపూర్వకంగా ట్విట్టర్ నుంచి మహిళలను అధిక సంఖ్యలో తొలగించారని మాజీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. మహిళలను లక్ష్యంగా చేసుకుని తొలగింపులు ఉన్నాయని అంటున్నారు.
సవరించిన చట్టం ప్రకారం.. వివాహేతర సంబంధం నెరిపితే ఏడాది జైలు శిక్ష, సహజీవనానికి ఆరు నెలలు శిక్ష విధిస్తారు. వేరొకరితో లైంగిక సంబంధం పెట్టుకున్నట్టు జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, సంతానం వీరిలో ఎవరైనా ఫిర్యాదు చేస్తేనే కేసు నమోదు చేస్తారు.
ఎట్టకేలకు ఇరాన్ ప్రభుత్వం ప్రజాపోరాటానికి తలవంచింది. మోరల్ పోలీసు వ్యవస్థను రద్దు చేసింది. అయితే హిజాబ్ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
భారతదేశంలో మత స్వేచ్ఛ పరిస్థితులు గణనీయంగా దిగజారాయి. ఈ సంవత్సరంలో, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, దళితులు, ఇతర మతపరమైన మైనారిటీలకు వ్యతిరేకంగా హిందూ జాతీయవాద ఎజెండాను ప్రోత్సహించే విధానాలను భారత ప్రభుత్వం అనుసరించింది. ”అని USCIRF తన నివేదికలో పేర్కొంది.
ముందుగా ఇన్ఫెక్షన్ సోకడం వల్ల లేదా టీకీ వేసుకోవడం వల్ల ఇప్పుడు రోగనిరోధక శక్తి పెరిగిందని ఇది ఒక రకంగా మంచి విషయమని వైద్యులు చెబుతున్నారు.
వివాహేతర సంబంధం విషయంలో బాధిత భార్య లేదా భర్త ఫిర్యాదు చేయవచ్చు. పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొంటే బాధితుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయవచ్చు.
ఇరాన్ ఫుట్ బాల్ టీం ఓడిపోవడం అక్కడి ప్రజలకు ఆనందాన్నిచ్చింది. మహ్సా అమినీ స్వస్థలమైన సకేజ్లో, అలాగే ఇరాన్లోని అనేక ఇతర నగరాల్లో, పౌరులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. “ఇరాన్ ఫుట్బాల్ జట్టుపై అమెరికా తొలి గోల్ చేసిన తర్వాత సాకేజ్ పౌరులు బాణసంచా కాల్చడం ప్రారంభించారు” అని లండన్కు చెందిన ఇరాన్ వైర్ వెబ్సైట్ ట్విట్టర్లో పేర్కొంది.
గర్భం దాల్చినందుకు, పిల్లలు పుట్టినందుకు, పిల్లల సంరక్షణకు పలు రకాల రాయితీలు ప్రకటిస్తోంది జపాన్ ప్రభుత్వం. అయితే ఇవేవీ పెద్దగా ఫలితాలనివ్వట్లేదు.
ఈ మూసివేతల కారణంగా ప్రభావితమయ్యే ఉద్యోగులకు తాము అండగా ఉంటామని, తమ కస్టమర్లకు అత్యుత్తమ ఆన్లైన్ షాపింగ్ సేవలను అందించడంపై తాము పూర్తిగా దృష్టి సారిస్తామని యాజమాన్యం ప్రకటించింది.