Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Saturday, September 20
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»NEWS»International

    నేపాల్‌లో భూకంపం.. 69 మంది మృతి

    By Telugu GlobalNovember 4, 2023Updated:March 30, 20251 Min Read
    నేపాల్‌లో భూకంపం.. 69 మంది మృతి
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో ఇప్పటివరకు 69 మంది మృతిచెందినట్టు తెలిసింది. పదుల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు. నేపాల్‌లోని వాయువ్య జిల్లాల్లో గల పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి 11 గంటలు దాటిన తర్వాత ఈ భూకంపం సంభవించినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.4గా నమోదైందని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపింది. భూకంప కేంద్రం 11 మైళ్ల లోతులో ఉన్నట్లు గుర్తించింది. నేపాల్‌ రాజధాని ఖాఠ్మండూకి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న జజర్‌కోట్‌లో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేపాల్‌ జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధన కేంద్రం తెలిపింది. భూకంప తీవ్రతకు పలు ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టం అయ్యాయి. రుకమ్‌ జిల్లాలో ఇళ్లు కూలి సుమారు 35 మంది, జజర్‌కోట్‌లో 34 మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.

    సహాయక చర్యలకు ఆటంకం…

    రాత్రి సమయం కావడం.. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం వల్ల ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుకాని పరిస్థితి ఏర్పడిందని అక్కడి అధికారులు తెలిపారు. దీంతో తక్షణ సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని వివరించారు. ప్రజలందరూ నిద్రకు ఉపక్రమించే సమయంలో భూకంపం సంభవించడం వల్ల ప్రాణనష్టం భారీగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఘటనపై నేపాలి ప్రధాని పుష్ప కమల్‌ స్పందిస్తూ.. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. 2015లో 7.8 తీవ్రతతో వచ్చిన భూకంప ప్రభావం వల్ల 9 వేల మంది మృత్యువాత పడ్డారు.

    భారత్‌లోనూ ప్రకంపనలు..

    ఈ భూకంప తీవ్రతకు భారత్‌లోని పలు ప్రాంతాలు కూడా ప్రకంపనలకు గురయ్యాయి. భూకంపానికి గురైన ప్రాంతానికి 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశ రాజధాని ఢిల్లీతో పాటు యూపీ, బిహార్‌లోని పలు ప్రాంతాల్లోనూ ప్రకంపనలు వచ్చాయి. ఈ ప్రకంపనలతో ఢిల్లీలోని ప్రజలు భయాందోళనలతో రోడ్లపైకి పరుగులు పెట్టారు. దీనికి సంబంధించి పలువురు సోషల్‌ మీడియాలో పోస్టులు చేశారు.

    Earthquake Nepal
    Previous Articleతేల్చుకోవాల్సిన క్షణమిది.! (కవిత)
    Next Article ఉజ్వల’ క్రాంతి (కథ)
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.