Telugu Global
International

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయ‌ప‌డిన వారిని ఆస్పత్రికి తరలించారు. కాల్పుల అనంతరం నిందితుడు పరారయ్యాడు.

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి
X

అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల ఘటనలు కొనసాగుతున్నాయి. నైట్‌ క్లబ్‌ వేదికగా కాల్పుల మోత మోగింది. ఓ దుండగుడు 19 మందిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఘటనలో ముగ్గురు యువకులు స్పాట్‌లోనే చనిపోయారు. 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. మిస్సిసిప్పి రాష్ట్రంలోని ఇండియానాలో ఉన్న చర్చి స్ట్రీట్‌ నైట్‌ క్లబ్‌లో ఈ దారుణం జరిగింది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయ‌ప‌డిన వారిని ఆస్పత్రికి తరలించారు. కాల్పుల అనంతరం నిందితుడు పరారయ్యాడు. పోలీసులు దుండగుడి కోసం గాలిస్తున్నారు. ఎందుకు కాల్పులు జరిపాడు అనే దానిపై దర్యాప్తు చేపట్టారు.

ఇటీవలే ఇండియానాలో భారత సంతతి వ్యక్తిపై ఓ డ్రైవర్‌ కాల్పులు జరిపాడు. కారును ఢీకొన్న విషయంపై ఇద్దరిమధ్య గొడవ జరిగింది. ఆగ్రహానికి గురైన డ్రైవర్‌ ఆ వ్యక్తి మెడపై కాల్పులు జరిపాడు. చికిత్స పొందుతూ బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు.

First Published:  22 July 2024 9:34 AM GMT
Next Story