Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Wednesday, September 24
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»NEWS

    భారత విలువిద్య జట్టు సంచలనం, 14 ఏళ్ళ తరువాత స్వర్ణం!

    By Telugu GlobalApril 28, 2024Updated:March 29, 20252 Mins Read
    భారత విలువిద్య జట్టు సంచలనం
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    పారిస్ ఒలింపిక్స్ ప్రారంభానికి ముందే భారత విలువిద్యజట్టు అదరగొట్టింది. 14 ఏళ్ళ విరామం తరువాత టీమ్ రికర్వ్ బంగారు పతకం గెలుచుకొంది…

    పారిస్ ఒలింపిక్స్ కు సన్నాహకంగా జరుగుతున్న 2024- ప్రపంచ విలువిద్య పోటీల కాంపౌండ్, రికర్వ్ విభాగాలలో భారత క్రీడాకారులు అందరగొట్టారు.

    పురుషుల, మహిళల వ్యక్తిగత విభాగాలతో పాటు..టీమ్ విభాగాలలో సైతం పతకాల పంట పండించారు.

    రికర్వ్ ఫైనల్లో సంచలనం…

    ఒలింపిక్స్ లో ప్రధాన క్రీడాంశంగా ఉన్న పురుషుల రికర్వ్ టీమ్ విభాగంలో భారతజట్టు 14 సంవత్సరాల విరామం తరువాత బంగారు పతకం గెలుచుకొని సంచలనం సృష్టించింది.

    చైనాలో షాంఘైవేదికగా జరుగుతున్న ఈ పోటీల కాంపౌండ్ విభాగంలో బంగారు పంట పండించుకొన్న భారత్..రికర్వ్ పురుషుల విభాగంలో మాత్రమే అంచనాలకు మించి రాణించగలిగింది.

    ధీరజ్ బొమ్మదేవర, తరుణ్ దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్ లతో కూడిన భారతజట్టు టైటిల్ పోరులో ప్రపంచ చాంపియన్ దక్షిణ కొరియాజట్టుపైన 5-1తో అరుదైన విజయం సాధించింది. ఈ విజయంతో పారిస్ ఒలింపిక్స్ బెర్త్ కు భారతజట్టు మరింత చేరువ కాగలిగింది.

    ప్రపంచ విలువిద్య రికర్వ్ విభాగంలో తిరుగులేని జట్టుగా పేరుపొందిన కొరియాను కంగు తినిపించడం భారత విలువిద్య జట్టు ప్రతిష్టను మరింత పెంచింది.

    తరుణ్ దీప్ అరుదైన ఘనత…

    2010 ప్రపంచ విలువిద్య రికర్వ్ విభాగంలో బంగారు పతకం సాధించిన భారతజట్టులోని కీలక సభ్యుడు తరుణ్ దీప్ రాయ్..ప్రస్తుత 2024 జట్టులోనూ సభ్యుడిగా స్వర్ణ పతకం అందుకోడం ఓ అరుదైన ఘనతగా మిగిలిపోతుంది.

    2010 ప్రపంచ ఫైనల్లో జపాన్ ను ఓడించిన భారతజట్టు..2024 ఫైనల్లో నంబర్ వన్ దక్షిణ కొరియాజట్టునే చిత్తు చేయడం విశేషం.

    రెండు ప్రపంచ మేటి జట్ల నడుమ జరిగిన ఈ పోరు నువ్వానేనా అన్నట్లుగా సాగింది. భారతజట్టు 57-57, 57-55, 55-53 పాయింట్ల తేడాతో టైటిల్ ఖాయం చేసుకోగలిగింది.

    మిక్సిడ్ టీమ్ విభాగంలో కాంస్యం…

    మిక్సిడ్ టీమ్ విభాగంలో కాంస్య పతకం కోసం జరిగిన పోరులో భారతజోడీ అంకిత బకాత్- ధీరజ్ 6-0 ( 35-31, 38-35, 39-37 ) తో మెక్సికో జంట అలెజాండ్రా వాలెన్షియా- మతయాస్ గ్రాండీలను చిత్తు చేశారు.

    కాంపౌండ్, రికర్వ్ విభాగాలలో భారత్ ఇప్పటి వరకూ 5 స్వర్ణ, ఒక్కో రజత, కాంస్య పతకాలు సాధించింది. మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో ప్రపంచ మాజీనంబర్ వన్ దీపిక కుమారీ సైతం పతకం వేటలో ఉంది.

    ధీరజ్ కు పారిస్ ఒలింపిక్స్ బెర్త్…

    ఇప్పటి వరకూ భారత్..పారిస్ ఒలింపిక్స్ ఆర్చరీలో కేవలం ఒక్క బెర్త్ మాత్రమే సంపాదించింది. రికర్వ్ విభాగం పురుషుల వ్యక్తిగత పోటీలలో పాల్గొనటానికి భారత స్టార్ ఆర్చర్ ధీరజ్ అర్హత సంపాదించాడు.

    జూన్ 18 నుంచి 23 వరకూ టర్కీలోని అంటాలియా వేదికగా జరిగే ప్రపంచ స్టేజ్-3 పోటీల ఫలితాల ఆధారంగా భారత జట్ల ఒలింపిక్స్ అర్హత ఖరారు కానుంది.

    ప్రస్తుత ప్రపంచ విలువిద్య టీమ్ ర్యాంకింగ్స్ లో భారత్ 231 పాయింట్లతో మూడో అత్యుత్తమజట్టుగా కొనసాగుతోంది.

    241 పాయింట్లతో చైనా నంబర్ వన్ ర్యాంకులో ఉంటే, 340 పాయింట్లతో దక్షిణ కొరియా రెండోర్యాంక్ లో నిలిచింది.

    కాంపౌండ్ విభాగంలో భారత్ గోల్డెన్ స్వీప్..

    ఒలింపిక్స్ లో పతకం అంశంగా లేని కాంపౌండ్ పురుషుల, మహిళల విభాగాలలో భారత్ కు ఎదురేలేకపోయింది. పురుషుల, మహిళల టీమ్ బంగారు పతకాలతో పాటు..మిక్సిడ్ టీమ్ స్వర్ణ పతకం సైతం భారత్ కే దక్కింది.

    మహిళల వ్యక్తిగత విభాగంలో ఆసియాక్రీడల గోల్డ్ మెడలిస్ట్ జ్యోతి సురేఖ ప్రపంచ పోటీల వ్యక్తిగత విభాగంలో సైతం విజేతగా బంగారు పతకం అందుకొంది. ప్రస్తుత ప్రపంచ విలువిద్య పోటీలలో భారత్ కు సురేఖ నాలుగో బంగారు పతకం అందించింది.

    అంతకుముందు జరిగిన పురుషుల, మహిళల టీమ్ విభాగాలతో పాటు..మిక్సిడ్ టీమ్ విభాగంలో సైతం భారత్ స్వర్ణాలు కైవసం చేసుకొంది.

    Paris Olympics Paris Olympics 2024
    Previous Articleమీరు ఎంతసేపు ఫోన్ వాడుతున్నారో ఇలా చెక్ చేసుకోవచ్చు!
    Next Article షాకింగ్‌.. ఫేషియల్ చేయించుకున్న ముగ్గురు మహిళలకు HIV
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.