Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Sunday, September 21
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»NEWS»National

    ఆడపిల్ల పుడితే రూ.50వేలు ఫిక్స్ డ్ డిపాజిట్

    By Telugu GlobalSeptember 4, 20231 Min Read
    ఆడపిల్ల పుడితే రూ.50వేలు ఫిక్స్ డ్ డిపాజిట్
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    రాజకీయ పార్టీలన్నిటికీ ఇటీవల మహిళల ఓట్లపై నమ్మకం కుదిరింది. మహిళలు ఆదరిస్తే కచ్చితంగా గెలిచి తీరతామన్న భావన నాయకులలో ఉంది. కర్నాటకలో ఇదే రుజువైంది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనే పథకం అక్కడ విజయవంతమైంది. అమలు చేయడానికి ప్రభుత్వం తిప్పలు పడటం వేరే విషయం. ఏపీలో కూడా దాదాపు అలాంటి పథకాలతోనే టీడీపీ కూడా మహిళలను ఆకట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. మహాశక్తి పేరుతో మహిళలకు వరాలు ప్రకటించింది. ఈ క్రమంలో పుదుచ్చేరి ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఆడపిల్లలు పుడితే వారి ఖాతాల్లో రూ.50వేలు ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తామని ప్రకటించింది. ఆ పథకాన్ని అమలులో పెట్టింది.

    పుదుచ్చేరి సీఎం రంగస్వామి ఇటీవలే అసెంబ్లీలో ఈ పథకం గురించి ప్రకటించారు, ఇప్పుడు దీన్ని అమలులోకి తెచ్చారు. ఆడపిల్లలు పుడితే వారి పేరిట బ్యాంకు ఖాతాలు ప్రారంభించి అందులో రూ.50వేలు జమ చేస్తామని హామీ ఇచ్చారు. కనీసం ఇలాగయినా భ్రూణ హత్యలు ఆగుతాయని ఆయన ఆకాంక్షించారు. ఆడపిల్లలపై వివక్ష తొలగిపోతుందన్నారు. తాజాగా ఈ పథకాన్ని ప్రారంభించిన సీఎం 38మంది మహిళలకు ఫిక్స్ డ్ డిపాజిట్ పత్రాలు అందించారు. వారి పిల్లలపై రూ.50వేలు బ్యాంకుల్లో జమ చేసినట్టు తెలిపారు.

    పుదుచ్చేరిలో కూడా మహిళల పేరిట అనేక పథకాలు అమలులో ఉన్నాయి. పేద మహిళలకు నెల నెలా రూ.1000 రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది. దాదాపు 13వేలమంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఇటీవల కొత్తగా ఆర్థిక సాయం మంజూరైనవారికి గుర్తింపు కార్డులు అందజేశారు సీఎం రంగస్వామి. బాలికా శిశు రక్షణ పేరుతో ఆడ పిల్లల పేరుతో రూ.50వేలు ఫిక్స్ డ్ డిపాజిట్ చేసే పథకాన్ని అదే రోజు కూడా ప్రారంభించారు. 

    Karnataka puducheri
    Previous Articleవాట్సాప్ మెసేజ్‌లో త‌ప్పులు దొర్లాయా!.. ఇలా ఈజీగా ఎడిట్ చేసేయొచ్చు
    Next Article పెన్షన్ స్కీమ్ లకు మహిళా ఉద్యోగులు దూరం.. ఎందుకంటే..?
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.