Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Thursday, September 11
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»NEWS

    గన్నవరం ఉడుకుతోంది.. అమరావతి వేడెక్కింది..

    By Telugu GlobalJune 3, 20221 Min Read
    గన్నవరం ఉడుకుతోంది.. అమరావతి వేడెక్కింది..
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    ఏపీలో వాతావరణం వేడెక్కింది. గన్నవరంలో అత్యథికంగా 44.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత అత్యథిక ఉష్ణోగ్రత అమరావతి(44.4 డిగ్రీలు)లో నమోదైంది. మొత్తమ్మీద ఏపీలో మరో మూడు రోజులపాటు అత్యథిక ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. విపత్తు నిర్వహణ సంస్థ కూడా ప్రజలను హెచ్చరించింది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలెవరూ అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రాకూడదని హితవుపలికింది. రాబోయే మూడు రోజుల్లో అత్యథిక ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరుకుంటాయని అంచనా.

    వేసవి ప్రారంభంలో ఎండలు మండిపోగా.. అసని తుపాను ప్రభావంతో ఏపీ ప్రజలు కాస్త ఊరట చెందారు. అయితే అదేమీ సంతోషించాల్సిన సమయం కాదని, పెనం వేడెక్కిందా లేదా తెలుసుకోడానికి దేవుడు కాసిన్ని నీళ్లు చిలకరించాడని, ఆ తర్వాత సూర్యుడి భగ భగలు తప్పించుకోలేమని సోషల్ మీడియాలో జోకులు పేలాయి. అనుకున్నట్టుగానే అసని తర్వాత కొన్నిరోజులపాటు ముసురు కనిపించినా ఆ తర్వాత ఎండలు విపరీతంగా పెరిగాయి. జూన్ వచ్చినా ఇంకా భానుడి భగభగలు తగ్గలేదు.

    మరో మూడు రోజులు కష్టమే..

    ఏపీలో మరో మూడురోజులపాటు వేడి గాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. శుక్రవారం 157 మండలాల్లో వేడిగాలులు, 83 మండలాల్లో తీవ్ర వేడిగాలులు వీచే అవకాశముందని చెబుతున్నారు. శనివారం 147 మండలాల్లో వేడిగాలులు, 68 మండలాల్లో తీవ్ర వేడిగాలులు ఉంటాయని హెచ్చరించారు. ఆదివారం కూడా అదే పరిస్థితి కొనసాగుతుందని చెబుతున్నారు. తూర్పుగోదావరి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలలో వేడిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇండియన్ మెటిరోలాజికల్ డిపార్ట్ మెంట్(IMD) అంచనాల మేరకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఈమేరకు హెచ్చరికలు జారీ చేసింది.

    #VALUE!,
    Previous Articleబస్సు ప్రమాదం… ఒకే కుటుంబానికి చె‍ందిన‌ ఎనిమిది మంది సజీవ దహనం
    Next Article ఒల్డ్ ఈజ్ గోల్డ్ ఆనంద్ టాప్ -10లో హారిక, ఆనంద్
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.