Telugu Global
NEWS

'జై ఎన్టీఆర్' అనడానికి డబ్బులిచ్చారా?

దేవర సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ జారీ చేసింది.

జై ఎన్టీఆర్ అనడానికి డబ్బులిచ్చారా?
X

ఎంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్ లో న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి భాగం సెప్టెంబర్ 27న గ్రాండ్ గా విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో మ‌రో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటించారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం మేక‌ర్స్ ‘దేవర’ ట్రైలర్‌ను ముంబైలో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ట్రైలర్ ఈవెంట్ కు బాలీవుడ్ నిర్మాత క‌ర‌ణ్ జోహార్‌, అనిల్ త‌డాని తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. అయితే ఈ కార్యక్రమంపై బాలీవుడ్ జర్నలిస్ట్ ఒకరు కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు.

ట్రైలర్ ఈవెంట్ జరుగుతున్నంత సేపు ‘జై ఎన్టీఆర్’ స్టోగన్స్ చేయడానికి కొంతమంది వ్యక్తులకు డబ్బు లిచ్చి తీసుకువచ్చారంటూ సదరు బాలీవుడ్ జర్నలిస్ట్సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ‘దేవర’ సినిమా ప్రమోషన్ పేరుతో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు ముందు సీట్లను కేటాయించి, జర్నలిస్ట్‌లను వెనక్కు నెట్టారని వెల్లడించారు. బాలీవుడ్ జర్నలిస్ట్ పోస్ట్ చేసిన ఈ వీడియోపై ఇపుడు సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ‘దేవర’ టీమ్ పై ఓ పక్క నెటిజెన్స్, మరో పక్క అభిమానుల మధ్య ఓ రేంజ్ వార్ జరుగుతోంది. ‘దేవర’ టీమ్ సౌత్ సినిమా ఇండస్ట్రీ పరువు తీస్తుందంటూ కొందరు కామెంట్స్ కూడా చేస్తున్ఆనరు. ప్రస్తుతం జర్నలిస్ట్ వీడియో బాగా వైరల్ అవుతోంది.

మరో వైపు దేవర సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ జారీ చేసింది. ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 57 నిమిషాల 58 సెకన్లు. ‘జనతా గ్యారేజ్‌’ తర్వాత ఎన్టీఆర్‌- కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. విజువల్స్‌ అద్భుతంగా ఉంటాయని, చివరి 40 నిమిషాలు సినిమాలో హైలైట్‌ అని ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ఎన్టీఆర్‌ చెప్పడంలో అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి.


First Published:  12 Sep 2024 2:19 PM GMT
Next Story