Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Sunday, September 21
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»NEWS

    ప్రపంచకప్ కు భారతజట్టు ఎంపిక అలాజరిగింది!

    By Telugu GlobalMay 1, 2024Updated:March 29, 20253 Mins Read
    ప్రపంచకప్ కు భారతజట్టు ఎంపిక అలాజరిగింది!
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ కు 15మంది సభ్యుల భారతజట్టు ఎంపిక పై మిశ్రమస్పందన వ్యక్తమయ్యింది. పేస్ బౌలింగ్ కూర్పు పేలవంగా ఉందంటూ విమర్శలు వెల్లువెత్తాయి.

    పదకొండు సంవత్సరాల విరామం తరువాత ఐసీసీ ప్రపంచకప్ గెలుచుకోవాలని కలలు కంటున్న భారత్..మరో రెండుమాసాలలో జరుగనున్న 2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ కు గురిపెట్టింది. 2007 ప్రారంభ టీ-20 ప్రపంచకప్ లో విజేతగా నిలిచిన భారత్ మరో ప్రపంచకప్ కోసం చకోరపక్షిలా ఎదురుచూస్తోంది.

    వెస్టిండీస్, అమెరికా దేశాల సంయుక్త ఆతిథ్యంలో జూన్ 2 నుంచి మూడువారాలపాటు జరుగనున్న ఈ టోర్నీలో పాల్గొనే 15 మంది సభ్యుల జట్టును బీసీసీఐ ఎంపిక సంఘం ప్రకటించిన కొద్దిగంటల వ్యవధిలోనే జట్టు కూర్పుపై పలువురు మాజీ దిగ్గజాలు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

    పాపం! శుభ్ మన్ గిల్, రింకూ సింగ్….

    టీ-20ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టులో యువఓపెనర్ శుభ్ మన్ గిల్ కు చోటు దక్కక పోడం దురదృష్టకరం మాత్రమే కాదు..స్వయంకృతాపరాదం అంటూ భారత మాజీ కెప్టెన్, విశ్వవిఖ్యాత క్రికెట్ వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్ తేల్చి చెప్పారు.

    భారత క్రికెట్లో ప్రస్తుతం అత్యంత ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఎక్కువగా ఉండటంతో శుభ్ మన్ గిల్, రింకూ సింగ్ లాంటి కొందరికి చోటు దక్కకపోడం సహజమేనని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.

    ప్రపంచకప్ కు రెండు పవర్ ఫుల్ జట్లను పంపే శక్తి ప్రస్తుత భారత క్రికెట్ కు ఉందని, 25 మంది ప్రతిభావంతుల నుంచి 15 మంది సభ్యులజట్టును ఎంపిక చేయడం కత్తిమీద సాము లాంటిదేనని అన్నారు.

    23 సంవత్సరాల గిల్ కు టీ-20 ఫార్మాట్లో 320 పరుగులు, 34.56 సగటు, 140.97 స్ట్ర్రయిక్ రేట్ ఉన్నా..ప్రస్తుత ఐపీఎల్ ఫామ్ మాత్రం స్థాయికి తగ్గట్టుగా లేదని, గత నాలుగు మ్యాచ్ ల్లో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా గిల్ సాధించలేకపోయాడని గవాస్కర్ గుర్తు చేశారు.

    స్థాయికి తగ్గట్టుగా ఫామ్ లో లేకపోడమే గిల్ కు శాపంగా మారిందని, ప్రపంచకప్ కు ఎంపిక కాలేకపోయాడని వివరించారు.

    రింకూ సింగ్ దీ అదేసీన్…

    మ్యాచ్ ఫినిషర్ గా గత ఏడాది వరకూ అదరగొట్టిన కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాడు రింకూ సింగ్ సైతం భారతజట్టులో చోటు దక్కించుకోడంలో విఫలమయ్యాడు.

    రింకూ సింగ్ స్థానాన్ని చెన్నై ఫ్రాంచైజీ ఆటగాడు శివం దూబే తన్నుకుపోయాడు.

    2023 ఐపీఎల్ సీజన్లో కోల్ కతా తరపున సత్తా చాటుకోడం ద్వారా భారత టీ-20 జట్టులో చోటు సంపాదించిన రింకూ సింగ్ 474 పరుగులు సాధించాడు. భారత్ తరపున ఆడిన మొత్తం 15 మ్యాచ్ ల్లో 356 పరుగులతో 89 సగటు నమోదు చేశాడు. 176 స్ట్ర్రయిక్ రేటుతో వారేవ్వా అనిపించుకొన్నాడు. అయితే ..ప్రస్తుత 2024 సీజన్లో రింకూసింగ్ ఆటతీరు నాసిరకంగా తయారయ్యింది. చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటీ ఆడలేకపోయాడు. దీంతో అంతంత మాత్రం ఫామ్ లో ఉన్న రింకూను కాదని..శివం దూబేకు ఎంపిక సంఘం పట్టం కట్టింది.

    పేస్ బౌలింగ్ లో పదునేది- మదన్ లాల్..

    రోహిత్ శర్మ నాయకత్వంలో ప్రపంచకప్ కు ఎంపికైన 15 మంది సభ్యుల భారతజట్టు బ్యాటింగ్, స్పిన్ విభాగాలలో పటిష్టంగా ఉన్నా..పేస్ బౌలింగ్ విభాగంలో మాత్రం తేలిపోయేలా కనిపిస్తోందని..భారత మాజీ ఆల్ రౌండర్ మదన్ లాల్ చెప్పారు.

    బుమ్రా, అర్షదీప్, పాండ్యా, సిరాజ్ లతో కూడిన భారత పేస్ ఎటాక్ లో నమ్మదగిన బౌలర్ కేవలం బుమ్రా మాత్రమేనని, మిగిలిన పేసర్లంతా గాల్లో దీపం లాంటి వారేనని అన్నారు.

    అర్షదీప్ కు డెత్ ఓవర్లలో భారీగా పరుగులిచ్చే బలహీనత ఉందని, సిరాజ్ ప్రస్తుతం నమ్మదగిన బౌలర్ గా ఏమాత్రం కనిపించడం లేదని తేల్చి చెప్పారు. హార్ధిక్ పాండ్యాను నమ్ముకోడం కుంటిగుర్రం మీద పందెం కట్టడం లాంటిదేనని చెప్పారు.

    భారత్ విశ్వవిజేతగా నిలవాలంటే పేస్ బౌలింగ్ పటిష్టంగా ఉండాలని మదన్ లాల్ సూచించారు.

    జూన్ 2న ప్రారంభంకానున్న ప్రపంచకప్ గ్రూప్- ఏ లీగ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో పాటు ఐర్లాండ్, కెనడా, అమెరికా జట్లతో భారత్ తలపడాల్సి ఉంది. భారత్ తన ప్రారంభమ్యాచ్ ను జూన్ 5న ఐర్లాండ్ తో ఆడాల్సి ఉంది.

    Cricket news T20 World Cup 2024
    Previous Articleఛీఛీ… మీరేం కొడుకులురా బాబు
    Next Article Naveen Chandra | నవీన్ చంద్రకు దాదాసాహెబ్ పాల్కే అవార్డు
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.