Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Saturday, September 20
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Editor's Choice

    రేవంత్‌ యూటర్న్‌.. ఫార్మా కాదు ఇండస్ట్రియల్‌ క్లస్టర్‌

    By Naveen KameraNovember 23, 20242 Mins Read
    రేవంత్‌ యూటర్న్‌.. ఫార్మా కాదు ఇండస్ట్రియల్‌ క్లస్టర్‌
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    సీఎం రేవంత్‌ రెడ్డి యూటర్న్‌ తీసుకున్నారా.. కమ్యూనిస్టు పార్టీల నేతలను నమ్మించడానికి అబద్ధం చెప్తున్నారా అనే చర్చ మొదలైంది. కొడంగల్‌ నియోజకవర్గంలోని లగచర్ల సమీప గ్రామాల్లో ఫార్మా ఇండస్ట్రీస్‌ ఏర్పాటు చేయడం, గిరిజనులపై పోలీసుల అఘాయిత్యాలపై కమ్యూనిస్టు పార్టీల నేతలు శనివారం సెక్రటేరియట్‌ లో సీఎం రేవంత్‌ రెడ్డిని కలిశారు. గిరిజనులు, రైతుల భూముల్లో కాలుష్యకారక ఫార్మా పరిశ్రమలు ఏర్పాటు చేస్తారన్న ఆందోళన అక్కడి ప్రజల్లో ఉందని వివరించారు. సీఎం స్పందిస్తూ.. తాను కొడంగల్‌ లో తలపెట్టింది ఫార్మా పరిశ్రమలు కాదన్నారు. కొడంగల్‌ లో ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ఏర్పాటు చేస్తున్నానని తెలిపారు. తన నియోజకవర్గంలోని ప్రజలు, యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే తన ఉద్దేశమన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధి తన బాధ్యత అన్నారు. సొంత నియోజకవర్గ ప్రజలను తానేందుకు ఇబ్బంది పెడుతానని అన్నారు. కాలుష్య రహిత పరిశ్రమలే ఏర్పాటు చేస్తామన్నారు. భూసేకరణ పరిహారం పెంపు అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీల నాయకులు లగచర్ల ఘటనపై ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేశారు. సీఎంను కలిసిన వారిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వివిధ కమ్యూనిస్టు పార్టీల నాయకులు ఉన్నారు.

    ఫార్మా పరిశ్రమ పేరుతో భూసేకరణ ఎందుకు?

    సీఎం రేవంత్‌ రెడ్డి తన సొంత నియోజకవర్గ ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతానని కమ్యూనిస్టు పార్టీల నాయకులను ఎదురు ప్రశ్నించడం వెనుక వ్యూహమేమిటా అనే చర్చ మొదలైంది. సొంత నియోజకవర్గంలో ఫార్మా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని అనుకున్నప్పుడు రైతులను ఒప్పించి మెప్పించి భూమి సేకరించాలి. అలా కాకుండా అధికార బలాన్ని ప్రయోగించాలని రేవంత్‌ చూశారు. కలెక్టర్‌, అధికారులపై దాడులు చేశారని చెప్తూ లగచర్ల సహా సమీప గ్రామాలపై వందలాది మంది పోలీసులు అర్ధరాత్రి పడి కరెంట్‌ తీసి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. బాధిత మహిళలు ఢిల్లీ వరకు ఎస్సీ, ఎస్టీ, మావన హక్కుల కమిషన్‌, మహిళ కమిషన్‌లకు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు తన అల్లుడి కోసం పేదల భూములను రేవంత్‌ చెరబడుతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. దానిని ప్యాచ్‌ అప్‌ చేసుకోవడానికి కలెక్టర్‌ పై హత్యాయత్నానికి రూ.10 కోట్ల సుపారీ ఇచ్చారనే ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. ఈమొత్తం వ్యవహారం కేసీఆర్‌ కనుసన్నల్లో సాగిందనే ప్రాపగండాకు ప్రయత్నించారు. అవేవి ఆశించిన స్థాయిలో వర్కవుట్‌ కాకపోగా బాధిత రైతులు, గిరిజనుల్లో కోపం మరింత ఎక్కువైంది. హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌, ఎస్టీ కమిషన్‌, ఉమెన్‌ కమిషన్‌ లగచర్లలో ఏం జరిగిందో తెలుసుకునే పనిలో పడ్డాయి. దీంతో ఇన్నాళ్లూ ఫార్మా పరిశ్రమపై ఎటాకింగ్‌ మోడ్‌లో ఉన్న రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ ప్రభుత్వ పెద్దలు ఒక్కసారిగా డిఫెన్స్‌ మోడ్‌ లోకి మారారు. తామేందుకు ప్రజలను ఇబ్బంది పెడుతామని అంటున్నారు. అదే నిజమైతే ఫార్మా పరిశ్రమల పేరుతో భూసేకరణకు ఎందుకు ప్రయత్నించారు? లగచర్లలో గిరిజనులపై పోలీసుల అఘాయిత్యాలకు బాధ్యులపై ఎందుకు చర్యలు చేపట్టలేదనే ప్రశ్నలు ప్రభుత్వాన్ని వేధిస్తున్నాయి. అల్లుడి పరిశ్రమల కోసమే బలవంతపు భూసేకరణ అనే ప్రచారం నుంచి బయట పడేందుకే కమ్యూనిస్టు నాయకులతో సీఎం అలా మాట్లాడారని.. అక్కడ ఫార్మా పరిశ్రమల ఏర్పాటు ఖాయమని ప్రభుత్వంలోని ముఖ్యులే చెప్తున్నారు.

    Kodangal Revanth Reddy
    Previous Articleత్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న తమన్నా వరుడు ఎవరో తెలిస్తే షాక్ ?
    Next Article రేవంత్‌ అబద్ధాలకు మరాఠ ప్రజలు గుణపాఠం చెప్పారు
    Naveen Kamera

    Keep Reading

    పేరు రైతులది.. పైసలు కాంట్రాక్టర్లకు!

    రేవంత్‌ విన్నపాలపై రాహుల్‌ రాడార్‌!

    వివాదాలు, విభేదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా కాంగ్రెస్‌

    ఎక్కే విమానం.. దిగే విమానం!

    రేవంత్ సర్కారు తొందరపాటు.. ప్రమాదంలో ఎస్ ఎల్ బీసీ భవితవ్యం

    రాష్ట్ర ఆదాయంపై రేవంత్‌ వేటు!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.