నడిరోడ్డుపై తల్లీ కుమారుడి హత్య
గుమ్మడిదల మండలం బొంతపల్లిలో చోటుచేసుకున్న ఘటన
BY Raju Asari14 Nov 2024 1:06 PM IST

X
Raju Asari Updated On: 14 Nov 2024 1:57 PM IST
సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకున్నది. తల్లీ కుమారుడిని నడిరోడ్డుపై నాగరాజు అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపేశాడు. గుమ్మడిదల మండలం బొంతపల్లిలో ఈ ఘటన జరిగింది. మృతులను సరోజాదేవి,అనిల్గా గుర్తించారు. ఆరు నెలల కిందట తన రెండున్నరేళ్ల కొడుకు మృతి కారణమని భావిస్తూ.. కక్ష పెంచుకుని ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.నిందితుడు నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story